‘చెక్’ ఒక ట్రెండ్సెట్టర్ అవుతుంది
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న చిత్రం ‘చెక్’. ప్రియా ప్రకాశ్వారియర్, రకుల్ ప్రీత్సింగ్, సాయిచంద్ కీలక పాత్రలు పోషించారు. భవ్యక్రియేషన్స్ పతాకంపై ఆనంద్ప్రసాద్ నిర్మించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించారు.
చిత్రబృందంతో ఈటీవీ చిట్చాట్
ఇంటర్నెట్ డెస్క్: చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న చిత్రం ‘చెక్’. ప్రియా ప్రకాశ్వారియర్, రకుల్ ప్రీత్సింగ్, సాయిచంద్ కీలక పాత్రలు పోషించారు. భవ్యక్రియేషన్స్ పతాకంపై ఆనంద్ప్రసాద్ నిర్మించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందంతో ఈటీవీ ముచ్చటించింది. ఈ సందర్భంగా నితిన్, ప్రియాప్రకాశ్, సాయిచంద్, హర్ష.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో చదివేయండి మరి.
ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం..?
నితిన్: ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందే ఒక భిన్నమైన సినిమా చేయాలని నాలో ఆలోచన ఉంది. ఆ సమయంలోనే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఈ లైన్ తీసుకొని నా దగ్గరికి వచ్చారు. దాదాపు 20 నిమిషాల్లో కథ చెప్పేశారు. ఒక ఖైదీ చెస్ నేర్చుకొని గ్రాండ్ మాస్టర్ అవుతాడు.. ఆ తర్వాత క్లైమాక్స్. ఆయన చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించింది. నేను చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉండబోతోందని అనిపించింది. అందుకే వెంటనే నేను సినిమాకు ఓకే చెప్పాను.
సినిమా ఔట్పుట్తో సంతోషంగా ఉన్నారా..?
నితిన్: మేము ఎలా రావాలని కోరుకున్నామో ఔట్పుట్ సినిమా అలాగే వచ్చింది. సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాను. ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుంది. అందరూ ఒక కొత్త నితిన్ను చూడబోతున్నారు. సినిమా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది.
నితిన్తో కలిసి పనిచేయడం ఎలా ఉంది..?
సాయిచంద్: చంద్రశేఖర్ యేలేటి గారు తీసిన ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమా చూశాను. ఎంతో థ్రిల్కు గురయ్యాను. డైరెక్టర్ ఇలా.. ఎలా.. ఆలోచించగలిగాడా..? అని ఆశ్చర్యానికి గురయ్యాను. నితిన్ గురించి చెప్పాలంటే. ఎన్నో సినిమాలు చేసిన అంత పెద్ద హీరో మాతో అంత అణుకువగా ఉంటాడని అనుకోలేదు. మాతో కలిసి చెస్ ఆడటం.. నేర్చుకోవడం.. ఇలా మా ఇద్దరి మధ్య తెలియకుండానే ఆత్మీయ అనుబంధం ఏర్పడింది.
నితిన్: మామూలుగా సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఉంటుంది. ఈ సినిమాలో మాత్రం మా ఇద్దరి మధ్య ఉంటుంది(నవ్వుతూ) ఇద్దరం గొడవపడుతూ.. కొట్లాడుతూ ఉంటాం.
మీకు అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది..?
ప్రియావారియర్: ఈ అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ‘మనమంత’ సినిమా చూశాను. నా పాత్ర విన్నతర్వాత ఈ సినిమా చేస్తానని వెంటనే చెప్పాను. నితిన్, రకుల్ లాంటి పెద్ద స్టార్లున్న సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం.
నితిన్ను సీరియస్ పాత్రలో చూడటం ఎలా ఉంది..?
హర్ష: ఈ పాత్రలో నితిన్ చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది. సినిమాపై నితిన్కు ఉన్న తపన నాకు తెలుసు. ‘గుండెజారి గల్లంతయ్యింది’ నుంచి నేను నితిన్తో చెప్తూ వస్తున్నాను. ఒక్కోసారి చంద్రశేఖర్ యేలేటి గారితో సినిమా చెయాలని అంటూ ఉండేవాడిని. ఈ సినిమా చేస్తున్నట్లు వార్త విన్న తర్వాత చాలా సంతోషం వేసింది. వాళ్ల కాంబినేషన్లో సినిమా వస్తే కచ్చితంగా బాగుంటుందని నా నమ్మకం. ఖైదీ పాత్రలో నితిన్ కచ్చితంగా అలరిస్తాడు.
సినిమా షూటింగ్ వ్యక్తిగతంగా మీకు ఎలాంటి అనుభవాలిచ్చింది..?
నితిన్: ఈ సినిమా వ్యక్తిగతంగా నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. షూటింగ్ జరిగినన్ని రోజులు నేను దిగాలుగా ఉండేవాడిని. ఎందుకంటే నా పాత్ర అలాంటిది. ఇంటికెళ్లిన తర్వాత కూడా అదే మూడ్లో ఉండిపోయేవాడిని. ఇంట్లో వాళ్లపై చిన్నచిన్నవాటికే చిరాకుపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో షూటింగ్ ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. ఒకరోజు షూట్కు వెళ్లడం ఇష్టంలేక కడుపునొప్పి వస్తుందని చెప్పి తప్పించుకున్నాను. ఈ సినిమా నాపై వ్యక్తిగతంగా ఎంతో ప్రభావం చూపించింది.
సినిమాలో రకుల్ కూడా ఉంది. మీ పాత్ర ప్రాధాన్యతపై ఏమైనా సందేహం వచ్చిందా..?
ప్రియ: అలాంటిదేం లేదు. ఈ సినిమాలో అవకాశం రావడమే నా అదృష్టం. ఒకవేళ మల్టీస్టారర్లో అవకాశం వచ్చినా అదేవిధంగా భావిస్తా.
పచ్చబొట్టులకు అర్థం ఏంటి..?
నితిన్: మనం పుట్టినప్పుడు ఎలాంటి మచ్చలేకుండా పుడతాం. పోయేలోపు మనకు నచ్చినట్లు బతకాలనేదే హీరో క్యారెక్టర్. అందుకే ఒంటినిండా పచ్చబొట్టులతో హీరో కనిపిస్తాడు.
ఒకే ఒక పాట ఉంది కదా..!
ప్రియ: ఉన్న ఒక్కపాటైనా నాకు ఎక్కువే. పాట కూడా బాగా వచ్చింది.
నితిన్: సినిమా చూసేటప్పుడు పాటలు లేవనే ఆలోచన రానేరాదు.
మీరు చేసిన ‘ఉప్పెన’ మంచి హిట్ అయింది. ఈ సినిమా నుంచి ఏం కోరుకుంటున్నారు..?
సాయిచంద్: ఈ సినిమా ‘తెలుగు లగాన్’ అవుందని నా నమ్మకం. నేను నటించానని చెప్పడం కాదు.. తెలుగు సినిమాల్లో ఇదొక ‘ట్రెండ్ సెట్టర్’ అవుతుందని అనుకుంటున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)