Sridevi Drama Company: డ్రమ్స్‌తో దుమ్ములేపిన ఆరేళ్ల పిల్లాడు

తమలో ఉన్న టాలెంట్‌ని ప్రేక్షకులకు చూపించి ఫేమ్‌ పొందాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న...

Published : 10 Jan 2022 13:04 IST

శ్రీదేవి డ్రామా కంపెనీలో సూపర్‌ టాలెంట్‌

హైదరాబాద్‌: తమలో ఉన్న టాలెంట్‌ని చూపించి ఫేమ్‌ పొందాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో ఈటీవీ వేదికగా ప్రతి ఆదివారం ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తాజాగా ఈ షోలో ఓ ఆరేళ్ల బాలుడు.. తన టాలెంట్‌తో అందర్నీ అబ్బురపరిచాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చెర్రీ అనే బాలుడు స్టేజ్‌పై డ్రమ్స్‌తో మ్యాజిక్‌ చేశాడు. మాస్‌, డీజే వెర్షన్లలో వావ్‌ అనిపించాడు. రెండేళ్ల వయస్సులోనే తాను డ్రమ్స్‌ నేర్చుకున్నానని.. తన తండ్రే నేర్పించాడని చెర్రీ చెబుతున్నాడు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు, ‘‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’’ పాటతో ఇటీవల ఓవర్‌ నైట్‌ ఫేమ్‌ సొంతం చేసుకున్న ఇంద్రావతి చౌహాన్.. లైవ్‌ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని