ఎస్పీబీ కోసం చిలుకూరు బాలాజీ అర్చకుల పూజలు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకోవాలని ప్రముఖుల నుంచి సామన్యూల వరకు అందరూ కోరుకుంటున్నారు. దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. శ్రావణమాసం అమావాస్య పురస్కరించుకొని చిలుకూరు బాలాజీ ఆలయంలో అర్చకులు

Published : 19 Aug 2020 23:01 IST

హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకోవాలని ప్రముఖుల నుంచి సామన్యూల వరకు అందరూ కోరుకుంటున్నారు. దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో అర్చకులు సైతం ఎస్పీ బాలు కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎస్పీ బాలు కరోనా నుంచి బయటపడాలని ఆదిత్య హృదయ పారాయణం, నరసింహ మంత్రంతో అర్చన చేసినట్లు పూజారులు తెలిపారు. చిలుకూరు బాలాజీకి ఎస్పీబాలు ప్రియమైన భక్తుడని, ఎన్నోసార్లు స్వామివారి సన్నిధికి వచ్చి పాటలు పాడారని చెప్పారు. చిలుకూరు బాలాజీపై తీసిన చిత్రంలో ఆయన నటించారని, అందుకే ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని