Chiranjeevi: నాకైతే ఆహ్వానం అందింది.. ఎవరెవరు వస్తున్నారో తెలీదు: చిరంజీవి

సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రమ్మని సీఎంఓ నుంచి తనకి ఆహ్వానం అందిందని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. గురువారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ..

Updated : 10 Feb 2022 12:24 IST

హైదరాబాద్‌: సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రమ్మని ఏపీ సీఎంఓ నుంచి తనకి ఆహ్వానం అందిందని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. గురువారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యేందుకు ప్రత్యేక విమానంలో ఆయన అమరావతికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎంఓ నుంచి నాకైతే ఆహ్వానం అందింది. నాతోపాటు ఎవరు వస్తున్నారో నాకు తెలీదు. మీడియాలో వస్తోన్న కథనాలు చూసిన తర్వాతనే మిగతా విషయాలు తెలిశాయి. సీఎంను కలిసిన తర్వాత మాట్లాడతా. ఈ రోజు సమస్యలకు శుభం కార్డు పడుతుందని ఆశిస్తున్నా’’ అని చిరు వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని