సినీ కార్మికులకు ఉచిత టీకా!: చిరంజీవి

కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కొవిడ్‌-19 టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్‌’...

Updated : 05 Apr 2021 19:49 IST

హైదరాబాద్‌: ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కొవిడ్‌-19 టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్‌’ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతిఒక్కరూ వీక్షించాల్సిన చిత్రమిదని అన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాన్ని అందించిన దర్శక నిర్మాతలను కొనియాడారు. టాలీవుడ్‌లో ఇలాంటి చిత్రాలు మరెన్నో రావాలని ఆకాంక్షించారు.

అనంతరం సినీ కార్మికుల గురించి మాట్లాడుతూ.. ‘గతేడాది కరోనా వైరస్‌ సృష్టించిన క్లిష్ట పరిస్థితుల్లో కరోనా క్రైసిస్‌ ఛారిటీని ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేశాం. అందులో ఇంకొంత మొత్తం మిగిలి ఉంది. దానితో సినీ కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్‌ ఇప్పించాలనే ఆలోచన మాకు వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం’ అని చిరు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు