Chiranjeevi: ‘కళా మహోత్సవాలు విజయవంతం చేద్దాం’.. చిరంజీవి పిలుపు

అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తుండటం  గర్వకారణమని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. వాటిని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు.

Published : 23 Mar 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తుండటం గర్వకారణమని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. వాటిని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. జానపద, గిరిజన కళలు, సంగీతం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించేందుకుగానూ కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది. వీటికి చిరంజీవి అతిథిగా హాజరవనున్నారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 26, 27న, వరంగల్‌లో 29, 30న, హైదరాబాద్‌లో ఏప్రిల్‌1 నుంచి 3 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని