Sumalatha: సుమలత తనయుడి వివాహ విందు.. చిరు దంపతుల సందడి

సుమలత (Sumalatha) తనయుడి వివాహ విందు వేడుకగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

Published : 08 Jun 2023 17:21 IST

బెంగళూరు: సీనియర్‌ నటి, కర్ణాటక ఎంపీ సుమలత (Sumalatha) కుమారుడు అభిషేక్‌ వివాహం సోమవారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివాతో ఆయన ఏడడుగులు వేశారు. ఈ నేపథ్యంలోనే అభిషేక్‌-అవివాల వివాహ విందు బుధవారం రాత్రి వేడుకగా జరిగింది. బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన జరిగిన ఈ వేడుకలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, యడియూరప్ప, చిరంజీవి - సురేఖ దంపతులు, శత్రుఘ్నసిన్హా, దర్శన్‌, రమ్య, ఖుష్బూ, జాకీష్రాఫ్‌ వంటి సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని