Chiranjeevi: భోళాశంకర్‌ చెల్లెలిగా కీర్తిసురేశ్‌.. రాఖీ స్పెషల్‌

చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆదివారం చిరు

Published : 22 Aug 2021 15:22 IST

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆదివారం చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘భోళాశంకర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను అలరించేలా టైటిల్‌ ఉండటంతో సామాజిక మాధ్యమాల వేదికగా చిరు అభిమానులు లైక్‌లు, రీట్వీట్‌లతో సందడి చేస్తున్నారు. కాగా, తమిళ సూపర్‌హిట్‌ ‘వేదాళం’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా ‘మహానటి’ కీర్తిసురేశ్‌ నటిస్తున్నారు. ఆదివారం రాఖీ పండగ కూడా కావడంతో చిరంజీవికి కీర్తి సురేశ్‌ రాఖీ కడుతున్న పోస్టర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.

‘చెల్లెళ్లందరి రక్షాబంధం.. అభిమానులందరి ఆత్మబంధం.. మనందరి అన్నయ్య జన్మదినం’ అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మరి వెండితెరపై సిస్టర్‌ సెంటిమెంట్‌ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని