Chiranjeevi: భుజం కాయడమే ఇష్టం.. భుజ కీర్తులు కాదు
నటుడిగా చిరంజీవి సినీ ప్రయాణం మొదలై నాలుగు దశాబ్దాలు దాటింది. కానీ, ఇప్పటికీ నటన పట్ల అదే నిబద్ధత.. అదే ఉత్సాహం. హుషారుగా వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు దీటుగా జోరు చూపిస్తున్నారు.
నటుడిగా చిరంజీవి (Chiranjeevi) సినీ ప్రయాణం మొదలై నాలుగు దశాబ్దాలు దాటింది. కానీ, ఇప్పటికీ నటన పట్ల అదే నిబద్ధత.. అదే ఉత్సాహం. హుషారుగా వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు దీటుగా జోరు చూపిస్తున్నారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ వినోదాలు పంచిస్తున్నారు. ఇప్పుడాయన ‘వాల్తేరు వీరయ్య’గా (Waltair Veerayya) సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. బాబీ (కె.ఎస్.రవీంద్ర) (Bobby) తెరకెక్కించిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు చిరు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలివి..
మీరు సీనియర్ హీరో. ఈతరం దర్శకులతో పని చేస్తున్నప్పుడు ఏదైనా సీన్ బాగా రాకుంటే వాళ్లు ధైర్యంగా మీతో చెప్పగలుగుతున్నారా?
‘‘నేను చేసింది నాకెప్పుడూ తెలిసిపోతుంటుంది. మానిటర్ కూడా చూడను. కాకపోతే నేను నా ఓకే కోసం ఎదురు చూడను. దర్శకులు సీన్ ఓకే అనే వరకు ఎదురు చూస్తా. వాళ్ల నోటి నుంచి ఆ మాట వచ్చే వరకు స్పాట్ నుంచి కదలను. దర్శకుడికనే కాదు.. నృత్య దర్శకుడికి.. ఫైట్ మాస్టర్కు.. ప్రతి ఒక్కరికీ పూర్తి స్వేచ్ఛనిస్తాను. ఓ కొత్త నటుడితో పని చేసేటప్పుడు వాళ్లెంత సౌకర్యంగా ఫీలవుతారో.. అలాంటి సౌకర్యాన్ని అందిస్తాను. ఎందుకంటే ఒక సినిమా బాగా రావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. ఒకవేళ అలా కష్టపడలేకపోతే రిటైర్ అయిపోవడం మంచిది’’.
‘ఆర్ఆర్ఆర్’లోని (RRR) ‘‘నాటు నాటు’’ (Naatu Naatu) పాటకు గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) పురస్కారం రావడం ఎలా అనిపించింది?
‘‘ఇది మనమంతా గర్వించదగ్గ విషయం. ఇదొక అద్భుతమైన.. చారిత్రక విజయం. నాకైతే ఇది మరింత ప్రత్యేకం. ఇంత మంచి పాటను అందించిన కీరవాణికి (Keeravani), సాహిత్యమందించిన చంద్రబోస్కు, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్ - కాలభైరవకు, నృత్యదర్శకుడు ప్రేమ్ రక్షిత్కు, ఇందులో నటించి, మెప్పించి మనందరితో వావ్ అనిపించిన ఎన్టీఆర్, రామ్చరణ్లకు నా శుభాభినందనలు’’.
తెలుగు సినిమాకి ఇది స్వర్ణయుగం అనుకోవచ్చా?
‘‘అసలు మన తెలుగు సినిమా ఆరంభం నుంచే స్వర్ణయుగంలో ఉంది. హెచ్.ఎమ్.రెడ్డి, కేవీ రెడ్డి.. ఇలాంటి గొప్ప దర్శకులతో ఆరోజుల్లోనే ఆ యుగం మొదలైపోయింది. అదిప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే ఇప్పుడా స్వర్ణయుగంలో ఉచ్ఛస్థితిని చూస్తున్నాం’’.
సాధారణంగా సంక్రాంతికి ఎప్పుడూ మీరే ముందొస్తుంటారు. కానీ, ఈసారి చివరగా వస్తున్నారు ఎందుకు?
‘‘ఈ సంక్రాంతికి మా మైత్రీ సంస్థ (Mythri Movie Makers) నుంచే రెండు సినిమాలు రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి చిత్రం ఎప్పుడొచ్చినా విజయం సాధిస్తుంది. బయ్యర్లు, ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం’’.
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)తో ప్రేక్షకులకు మళ్లీ ఆ వింటేజ్ చిరంజీవిని పరిచయం చేస్తున్నట్లున్నారు కదా?
‘‘హుషారుగా చేయాలన్నా.. నాకిష్టమైన టాలెంట్స్ అన్నీ బయట పెట్టుకోవాలన్నా కమర్షియల్ కథల్లోనే బాగా కుదురుతుంది. కానీ, వ్యక్తిగతంగా నేనెప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలు చేయాలని తపన పడుతుంటాను. అందులో భాగంగానే ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ లాంటి చిత్రాలు చేశాను. కానీ, ఆ తర్వాత కాలంలో నాకేం కావాలి అని ఆలోచించడం కంటే ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది అందివ్వడం నా కర్తవ్యంగా భావించాను. ఇప్పుడొస్తున్న ఈ ‘వాల్తేరు వీరయ్య’ కూడా అలాంటి ప్రయత్నమే. ప్రేక్షకులు నా నుంచి ఎలాంటి అంశాలు కోరుకుంటారో.. అవన్నీ పుష్కలంగా ఉన్న చిత్రమిది. ఈ సినిమాతో పాత చిరంజీవిని మళ్లీ చూస్తారు. ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ముఠామేస్త్రి’ల్లో నేనెలా కనిపించానో.. ఈ ‘వాల్తేరు వీరయ్య’లోనూ అలా కనిపిస్తాను. ఇప్పటి వరకు నేనింత మాస్గా ఎప్పుడూ కనిపించలేదు. చిత్రీకరణను ఆద్యంతం చాలా ఎంజాయ్ చేశా. సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’
మీరు.. రవితేజ (Raviteja) ‘అన్నయ్య’లో కలిసి నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రంలో కలిసి చేశారు. ఎలా అనిపించింది?
‘‘రవితేజ ఆరోజుల్లో ఎంత సరదాగా ఉన్నాడో.. ఈరోజుకీ అలాగే ఉన్నాడు. నటన పట్ల తనకున్న ప్రేమ, వాత్సల్యం అలాగే ఉన్నాయి. రవి తన ఎనర్జీతో ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యాడు. కథకు బలాన్ని చేకూర్చాడు. బాబీ కథ చెప్పినప్పుడే ఈ పాత్రకు రవితేజ బాగుంటాడని అందరం అనుకున్నాం. ఈ సినిమాలో మేమిద్దరం డైలాగులు మార్చుకున్నాం. తన ‘ఇడియట్’లోని డైలాగ్ నేను.. నా చిత్రంలోని డైలాగ్ తను చెప్పాడు. ఫ్యాన్స్కు కిక్ ఇవ్వడం కోసమే అలా డైలాగ్స్ మార్చుకున్నాం. ఈ ఆలోచన పూర్తిగా దర్శకుడు బాబీదే’’.
ఈ మధ్య ‘మీకింత అతి మంచితనం అవసరమా’ అని మీ ఫ్యాన్స్’ అనుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయమేంటి?
‘‘కచ్చితంగా అవసరమే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎదురుతిరిగితే ఆ క్షణానికి నా అహం చల్లారుతుందేమో కానీ, సినిమాకి భారీగా నష్టం వస్తుంది. అభిమానులు నిరాశ చెందుతారు. నా సంయమనం ఇంత మందికి మంచి చేస్తుందంటే నేను వెనక్కు తగ్గుతాను. నేనెప్పుడూ అంతిమ ఫలితం చూస్తాను. అలా చూడాలంటే మనలో పరిణతి, విజ్ఞత ఉండాలి. కొంతమంది పోరాట యోధులు ఉంటారు. వాళ్లు మాట అంటారు.. అనిపించుకుంటారు’’.
ఒకప్పటికీ.. ఇప్పటికీ కథల ఎంపికలో మీ ఆలోచనా విధానం ఏమైనా మారిందా?
‘‘కథను బలంగా విశ్వసించే వ్యక్తిని నేను. సాధారణంగా అందరూ కథలు వింటారు. కానీ, నేను చూస్తాను. కథ వింటున్నప్పుడే దాన్ని విజువలైజ్ చేసేసుకుంటా. కథలో ఎన్ని పాటలున్నాయి. ఎన్ని ఫైట్స్ ఉన్నాయని చూడను. అవన్నీ అలంకారాలుగానే భావిస్తా. కథకు సహజ సౌందర్యాన్నిచ్చేది అందులోని భావోద్వేగాలే. అందుకే కథలో ఎంత ఎమోషన్ ఉందో చూస్తా. ప్రేక్షకులు ఓ వంద రూపాయలిచ్చి సినిమాకు వస్తే నా వంతుగా వాళ్లకు నేనేం అందిస్తున్నా అనేది చూస్తా’’.
మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే అణకువతో ఉన్నారు. ఈ విషయంలో కొత్తతరానికి మీరిచ్చే సలహాలేంటి?
‘‘కొందరికి ఇలా ఉండటం సహజంగానే వస్తుంది. మన కోసం కాకుండా ఇతరుల కోసం ఆలోచించాలి. ఆ ఇతరులలో దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అంతా ఉంటారు. మన ప్రవర్తన అన్నింటి కంటే ముఖ్యం. అది బాగుంది కాబట్టే నాకు వరుసగా సినిమాలొచ్చాయి. మన ప్రవర్తన సరిగా లేనప్పుడు వరుస పరాజయాలు తారసపడినా.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ‘వాడికి బాగా అయ్యింది రా’ అనుకొని చుట్టూ ఉన్న వాళ్లు భుజం దించేస్తారు తప్పితే ఎవరూ జాలి కూడా చూపరు. అందుకే మన ప్రవర్తన ఎప్పుడూ సరిగా ఉండాలి’’.
దర్శకత్వం చేయాలన్న దిశగా ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
‘‘ఈ మధ్యే ఎవరితోనో అన్నా.. ఎన్నిరోజులని మనం ఇలాగే తెరపై కనిపిస్తూ ఉంటాం. ఏదోక రోజు తెరమరుగు అవ్వాల్సి వస్తుంది. దాన్ని సంతోషంగా స్వీకరించాలి. కాకపోతే పనిలేకుండా ఉండటం కానీ, తక్కువ పని చేయడం గానీ నాకిష్టం లేదు. హాలీవుడ్ ప్రముఖుడు క్లింట్ ఈస్ట్వుడ్ 92ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ నటిస్తూ.. దర్శకత్వం చేస్తూ ఉత్సాహంగా జీవిస్తున్నారు. ఆయన్ని చూసినప్పుడు నాకెంతో స్ఫూర్తిగా అనిపించింది. ఇలా జీవించినంత కాలం సినిమాకి సేవ చేయగలగడం కంటే కావాల్సింది ఏముంది. భవిష్యత్తులో నేను చేయాల్సిన పరిస్థితి వస్తే కచ్చితంగా దర్శకత్వం చేస్తా’’.
మిమ్మల్ని ఇండస్ట్రీకి పెద్ద అనొద్దని ఎందుకంటున్నారు?
‘‘ఇండస్ట్రీ పెద్ద అనే అదనపు భుజ కీర్తుల వల్ల నాకు ఒరిగేదేం లేదు. అందుకే ఆ పేరు వద్దనుకున్నా. కాకుంటే ఇండస్ట్రీకి నా రుణం తీర్చుకునే తరుణం ఆసన్నమైతే ఏ స్థాయికైనా సరే నా భుజం కాస్తాను. అండగా ఉంటాను. నాకు భుజం కాయడం ఇష్టం తప్ప.. భుజ కీర్తులు కాదు’’.
మీరు గొప్ప నటుడిగా ఉండాలనుకుంటున్నారా? మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నారా?
‘‘మంచి నటుడు అనేది నాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తా. అది నా అదృష్టం. కానీ, అది శాశ్వతం కాదన్నది సత్యం. కానీ, ఒక మంచి మనిషి అనేది శాశ్వతం. అది కాదనలేని సత్యం. మనం చనిపోయినా అది మాత్రం నిలిచిపోతుంది. రియల్ హీరోగా ఉంటూ.. రీల్ హీరోగా ఎక్కువ కాలం కొనసాగాలని నా కోరిక’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!