Chiranjeevi: మళ్లీ నా విశ్వరూపం చూపిస్తా: చిరంజీవి
‘నటుడిగా మళ్లీ నా విశ్వరూపాన్ని చూపిస్తా’ అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ ప్రమోషన్స్లో భాగంగా చిరు, చరణ్....
హైదరాబాద్: ‘నటుడిగా మళ్లీ నా విశ్వరూపాన్ని చూపిస్తా’ అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ ప్రమోషన్స్లో భాగంగా చిరు, చరణ్, కొరటాల శివతో దర్శకుడు హరీశ్శంకర్ స్పెషల్ చిట్చాట్ నిర్వహించారు. ‘ఆచార్య’ విశేషాలతోపాటు అవకాశం వస్తే తప్పకుండా పవన్ కల్యాణ్ ‘భవధీయుడు భగత్ సింగ్’లో నటిస్తానని చిరు చెప్పారు. అంతేకాకుండా, ‘భవదీయుడు భగత్సింగ్’ నుంచి ఓ పవర్ఫుల్ డైలాగ్ని చిరు లీక్ చేసేశారు.
పునాది రాళ్లు.. ఆరోజే అర్థమైంది
‘‘పునాది రాళ్లు’ సినిమా కోసం 1978 ఫిబ్రవరి 11న.. నేను మొదటిసారి కెమెరా ముందుకు వచ్చా. అందులో నాతోపాటు మరికొంతమంది ఆ సీన్లో ఉన్నారు. మేమంతా పొలం పనులు చేసి రాగానే, మహానటి సావిత్రమ్మ మాకు భోజనం వడ్డించే సీన్ అది. నా ప్లేస్ వచ్చే వరకూ నేను కెమెరా ముందు అలాగే నిల్చుని ఉండాలి. అది నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడి.. ఆ సీన్కి ముందు ఏ సీన్ వస్తుందో కనుక్కొని దానికి అనుగుణంగా నన్ను నేను కాస్త మార్చుకుని యాక్ట్ చేశాను. ఆ షాట్ పూరైన వెంటనే కెమెరామెన్ నన్ను పిలిచి.. ‘నీ పేరేంటి? నువ్వు బాగా చేస్తున్నావ్? ఈ షాట్లో నేను నిన్నే చూస్తూ ఉండిపోయా’ అని ప్రశంసించారు. ఆ మాటలకు నేనెంతో ఆనందించా. ‘నా పేరు చిరంజీవి’ అని చెప్పా. మన పాత్ర పరిధి మేరకు మనం వందశాతం నటించగలిగితే తప్పకుండా అందరూ ప్రశంసిస్తారని ఆరోజే అర్థమైంది’’
గ్లిజరిన్ వాడలేదు..!
‘‘సిద్ధ పాత్రలో చరణ్ ఉంటే బాగుంటుందని నాకు ముందు నుంచే ఆలోచన ఉంది. శివ కూడా అలాగే అనుకోవడం వల్ల మేమిద్దరం ఒకే స్క్రీన్పై నటించే అవకాశం వచ్చింది. ‘ఆచార్య’ చరిత్రలో నిలిచిపోయే సినిమా కావాలంటే ప్రతిక్షణం మేం మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రేక్షకుల్ని మెప్పించేలా ప్రతి సన్నివేశంలో నటించాలని నిర్ణయించుకున్నాం. అందుకు అనుగుణంగా మేం నటించాం. కానీ, ఓ సన్నివేశంలో చరణ్ నటన చూసి నేను నిజంగానే భావోద్వేగానికి గురయ్యా. చరణ్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నా. ఆక్షణం మా ఇద్దరికీ కన్నీళ్లు వచ్చేశాయి. ఆ సీన్లో మేమిద్దరం గ్లిజరిన్ లేకుండానే కన్నీరు పెట్టుకున్నాం. సిల్వర్ స్క్రీన్పై ఈ సీన్ చూసినప్పుడు ఎంతటి కఠినాత్ముడైనా కన్నీళ్లు పెట్టుకోక తప్పదు’’
‘అవన్నీ ఊహాగానాలు..!’
‘‘ఆర్ఆర్ఆర్’లో బిజీగా ఉండటం వల్ల చరణ్ ‘ఆచార్య’ షూట్ కాస్త ఆలస్యంగా ప్రారంభించాడు. దాంతో నేను ఓ సారి శివ దగ్గరకు వెళ్లి.. ‘శివా.. చరణ్ వల్ల సినిమా ఆలస్యమయ్యేలా ఉంది. కాబట్టి వేరే హీరోని సెలక్ట్ చేద్దామా?’ అని అడిగా. మాటైతే చెప్పగలిగాను గానీ నాకు ఎంతమాత్రం అది ఇష్టం లేదు. మనస్ఫూర్తిగా సిద్ధ పాత్రకు చరణ్ అయితేనే బాగుంటుందని గట్టిగా నమ్మా. కొరటాల శివ కూడా మార్చేందుకు ఇష్టపడలేదు. అయితే, అదే సమయంలో ‘ఆచార్య’లోకి వేరే హీరోని తీసుకున్నామని వరుస కథనాలు వచ్చాయి. అవన్నీ ఊహాగానాలు మాత్రమే’’
తొమ్మిదేళ్లు ఆమె బాధపడింది..!
‘‘చరణ్ నేనూ కలిసి నటిస్తే చూడాలని సురేఖ ఎన్నో కలలు కంది. నేను రాజకీయాల్లోకి వెళ్లడం.. చరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒకే సమయంలో జరిగింది. దాంతో మేమిద్దరం కలిసి నటించే అవకాశం లేకుండా పోయింది. అలా, సురేఖ తొమ్మిదేళ్లు బాధపడుతూనే ఉంది. మరలా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. ఆమె కోరిక మరోసారి జీవం పోసుకుంది. మేమిద్దరం పూర్తిస్థాయి పాత్రల్లో కలిసి నటిస్తే చూడాలనుకుంటున్నట్లు ఎన్నోసార్లు చెప్పింది. అలాంటి సమయంలోనే శివ ఓసారి ఈ కథతో వచ్చాడు. చరణ్, నేనూ ‘ఆచార్య’ సినిమాకి ఓకే అయ్యాక సురేఖతో ఈ విషయం చెప్పా. ‘‘నీ కోరిక చాలా బలమైంది. శివ చెప్పిన కథలో మేమిద్దరం నటిస్తున్నాం. ఇద్దరివీ వీరోచితమైన పాత్రలే. షూటింగ్ ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నా’’ అని సురేఖతో చెప్పగానే ఆమె కళ్లలో అంతులేని ఆనందం చూశా’’
చరణ్ని చూసి శెభాష్ అన్నా..!
‘‘‘చిరుత’ షూట్ బ్యాంకాంక్లో జరుగుతున్నప్పుడు ఓసారి నేనూ, సురేఖ సెట్కి వెళ్లాం. చరణ్ నల్లగా ఎండకు కమిలిపోయి ఉన్నాడు. వాడిని అలా చూసి సురేఖ బాగా బాధపడింది. నాకు మాత్రం ‘వావ్ కష్టపడుతున్నాడు’ అని భావన కలిగింది. వెంటనే చరణ్ దగ్గరకు వెళ్లి ‘శెభాష్’ అన్నా. ఎన్ని సినిమాలు చేశాడు? ఎంత బాగా నటించాడు? అనేది మేటర్ కాదు. చేస్తున్న పాత్రలోకి పరకాయం ప్రవేశం చేసి కష్టపడుతున్నాడా? లేదా? అనేది ముఖ్యం. నేను అలాగే కష్టపడ్డా. నా బిడ్డ చరణ్ కూడా అదేవిధంగా కష్టపడి ఇంటికి వస్తాడు’’
మళ్లీ నా విశ్వరూపం చూపిస్తా..!
‘‘సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని తొమ్మిదేళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం, మరలా సినిమాల్లోకి వచ్చాక కూడా సీరియస్ సబ్జెక్ట్లు చేయడం వల్ల నేను నవ్వడం మర్చిపోయా. ‘నాలో హాస్యగ్రంథులు చచ్చిపోయాయా?’ అని అప్పుడప్పుడూ నాకే అనుమానం వస్తుంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ‘దొంగ మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ లాంటి కథలు వస్తే తప్పకుండా మళ్లీ నా విశ్వరూపం చూపిస్తా. ఇలాంటి కథలు హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తే తప్పకుండా నేను నటిస్తా’’
ఆ కాంబోకి ఇది నాంది..!
‘‘చిరు-చరణ్-పవన్కల్యాణ్ ఈ కాంబో కోసం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ఆ కాంబోకి చరణ్-చిరు కాంబో ఇప్పుడు నాంది అవుతుందని నేను భావిస్తున్నా. హరీశ్శంకర్ తెరకెక్కిస్తోన్న ‘భవధీయుడు భగత్ సింగ్’లో అవకాశం ఉంటే తప్పకుండా నేనూ-చరణ్ నటిస్తాం’’
అందరూ అదరగొడుతున్నారు..!
‘‘ఇప్పుడున్న జనరేషన్లో హీరోలందరూ డ్యాన్స్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్, నితిన్, రామ్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. (మధ్యలో చరణ్ అందుకుని నా దృష్టిలో తారక్, బన్నీ బెస్ట్ డ్యాన్సర్స్). ఇంకో విషయం ఏమిటంటే ఒకవేళ నా సినిమాల్లో ఏదైనా చిత్రాన్ని ఇప్పుడు తెరకెక్కించాలంటే ‘చంటబ్బాయ్’ చిత్రాన్ని బన్నీ తీస్తే బాగుంటుందని అనుకుంటున్నా’’
మెగా లీక్..!
‘‘విలన్పై పోరాటం చేయడానికి ఓ లక్షమంది విద్యార్థులతో పవన్కల్యాణ్ రోడ్డెక్కుతాడు. అది చూసిన విలన్.. ‘ఏంటయ్యా వీడి ధైర్యం. ఆ లక్ష మంది వీడి వెనుక ఉన్నారనా?’ అని ప్రశ్నించగానే.. విలన్ పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. ‘లేదు సర్. ఆ లక్ష మంది ముందు ఈయన ఉన్నాడని వాళ్లకు ధైర్యం’ అని చెబుతాడు’’ ఈ డైలాగ్ ఇటీవల హరీశ్ నాతో చెప్పాడు. నాకెంతో నచ్చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..