Chiranjeevi: సీఎం జగన్‌తో ముగిసిన చిరంజీవి భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో అగ్ర కథానాయకుడు చిరంజీవి భేటీ ముగిసింది.

Updated : 13 Jan 2022 14:41 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో అగ్ర కథానాయకుడు చిరంజీవి భేటీ ముగిసింది. సుమారు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రధానంగా టికెట్‌ ధరల అంశాన్ని చిరు, జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశం అనంతరం చిరంజీవి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్‌కు చిరంజీవి వివరించారు. అదే విధంగా సినిమా టికెట్‌ ధరలను పెంచాలని, పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. కొవిడ్‌ దృష్ట్యా సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని