జర్నలిస్టు ఇంటికెళ్లి.. హామీ ఇచ్చిన చిరు

ఓ పక్క ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌.. మరోపక్క నిహారిక పెళ్లి వేడుకలు.. ఇంత బిజీగా ఉన్నప్పటికీ అగ్ర కథానాయకుడు చిరంజీవి సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ నాయుడుని కలిశారు. గత కొన్ని రోజులుగా రామ్మోహన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరు పరామర్శించేందుకు ......

Published : 07 Dec 2020 01:04 IST

హైదరాబాద్‌: ఓ పక్క ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌.. మరోపక్క నిహారిక పెళ్లి వేడుకలు.. ఇంత బిజీగా ఉన్నప్పటికీ అగ్ర కథానాయకుడు చిరంజీవి సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ నాయుడుని కలిశారు. కొన్ని రోజులుగా రామ్మోహన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరు పరామర్శించేందుకు స్వయంగా ఆయన ఇంటికెళ్లారు. రామ్మోహన్‌, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. అంతేకాదు స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

ఏఐజీ హాస్పిటల్స్‌ యాజమాన్యంతో మాట్లాడి, మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేస్తానని ఈ సందర్భంగా చిరు అన్నట్లు తెలిసింది. రామ్మోహన్‌ నిజాయతీగల పాత్రికేయుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. చిరు ప్రజారాజ్యం పార్టీ కోసం రామ్మోహన్‌ పనిచేశారు. ఆయన సేవను గుర్తు పెట్టుకుని, క్లిష్ట సమయంలో ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. అవసరాల్లో ఉన్న వారికి తనవంతు సాయం చేయడానికి చిరు ఎప్పుడూ ముందుంటారు. కరోనా సంక్షోభంలో సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 
ఇవీ చదవండి..
రైతన్నలకు కోటి  విరాళమిచ్చిన గాయకుడు
నేనెంతో లక్కీ: పాయల్‌ ప్రియుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని