Chiranjeevi: ఇండస్ట్రీని ఆదుకోండి.. తెలుగు ప్రభుత్వాలకు చిరు విజ్ఞప్తి
Tollywood: కరోనా పరిస్థితులను దాటుకొంటూ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: ‘ఏ విపత్తు జరిగినా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. కానీ, కరోనా కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమ సాధక, బాధకాలను గుర్తించి తగిన సాయం చేయండి’ అని అగ్ర కథానాయకుడు చిరంజీవి తెలుగు ప్రభుత్వాలను కోరారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ మూవీ ‘లవ్స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీరిలీజ్ వేడుక జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ఖాన్, అగ్ర కథానాయకుడు చిరంజీవి విచ్చేశారు. ‘లవ్స్టోరీ’ చిత్ర బృందానికి చిరు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా పరిస్థితులను దాటుకొంటూ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయన మాట్లాడారు.
‘‘కొవిడ్ తర్వాత ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావటం చిన్నపిల్లవాడు స్కూల్కు వెళ్తున్న భావన కలుగుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. చిత్ర పరిశ్రమలో సక్సెస్రేట్ అనేది చాలా తక్కువ. 10-15శాతం మాత్రమే ఉంటుంది. మహా అయితే, 20శాతం. ఈ మాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా, కళకళలాడిపోతోందంటారు. కానీ, ఇక్కడ కూడా కష్టాలు పడేవారు, రెక్కాడితే కానీ, డొక్కాడని కార్మికులు ప్రత్యక్షంగా వేల మంది.. పరోక్షంగా లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వాళ్లందరూ కలిస్తేనే చిత్ర పరిశ్రమ. నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిస్తే ఇండస్ట్రీ అవదు. వీళ్లు బాగున్నారు కదాని, సినిమా ఇండస్ట్రీ బాగుందనుకుంటే మెరిసేదంతా బంగారం కాదు. ఈ విషయం కరోనా సమయంలో స్పష్టంగా కనిపించింది. నాలుగైదు నెలలు షూటింగ్స్ ఆగిపోయే సరికి, కార్మికులు అల్లాడిపోయారు. హీరోలను, సినీ పెద్దలను, నిర్మాతలను అడిగి డబ్బులు పోగుచేసి, కార్మికుల కోసం నిత్యావసర సరకులు అందించాం. ఆ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా చక్కబడ్డాయి. కానీ, ఒక నెల షూటింగ్ లేకపోతే కార్మికులు ఎంత ఇబ్బంది పడతారనే విషయాన్ని చెప్పడానికి ఈ మాట చెబుతున్నా’’
‘‘ఏ విపత్తు వచ్చినా అందరి కంటే ముందు స్పందించేది చిత్ర పరిశ్రమ మాత్రమే! ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈరోజు సంక్షోభంలో పడిపోయింది. నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. ఎక్కడా సర్దుకుపోయే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ‘లవ్స్టోరీ’ ప్రీరిలీజ్ వేడుక వేదికగా ఓ విజ్ఞప్తి చేస్తున్నా. అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడానికి కారణాలు ఏంటి? ఇంకా ఏం చేస్తే చిత్ర పరిశ్రమ బాగుంటుంది? ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వస్తువులు, కాయగూరలను ముందు చూసి ఆ తర్వాత కొంటాం. కానీ ముందు కొనేసి, ఆ తర్వాత చూసేది సినిమాను మాత్రమే! మా మీద నమ్మకంతోనే మీరు(ప్రేక్షకులు) సినిమాలు చూస్తున్నారు. చిరంజీవి ఉన్నాడంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని మరో ఆలోచన లేకుండా థియేటర్కు వస్తారు. మేము కూడా నిరాశ పరచకుండా మా వంతు కృషి చేస్తుంటాం. దాని వల్ల వ్యయం పెరగవచ్చు. కొన్ని సార్లు మా అభిరుచుల మేరకు సినిమా తీసి ఫెయిల్యూర్ కావచ్చు. అది మా తప్పిదం’’
‘‘ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని కోరుకునే మాకు, సాధకబాధకాలు ఉన్నప్పుడు మీరు దయ చేసి దీనిపై దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించాలి. ‘మేము ఆశగా అడగటం లేదు.. అవసరానికి అడుగుతున్నాం’. అది మీరు ఒప్పుకోవాలని కోరుతున్నా. సినిమాలు పూర్తయి కూడా మరో సినిమా చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడిపోయాం. ‘ఆచార్య’ అయిపోయింది. ఎప్పుడు విడుదల చేయాలి? ఎలా రిలీజ్ చేయాలి? చేస్తే రెవెన్యూ వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు వెంటాడుతున్నాయి. జనాలు వస్తారా? లేదా? అన్న దాని నుంచి ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తోంది. ‘లవ్స్టోరీ’ అన్నింటికీ దారి చూపే సినిమా అవుతుందని అనుకుంటున్నా. అయితే, రెవెన్యూ ఎంత వస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. ఈ విషయంలోనే ప్రభుత్వాలు మనకు ధైర్యం, వెసులుబాటు ఇవ్వాలి. వీలైనంత త్వరగా చిత్ర పరిశ్రమకు మేలు చేసే జీవోలను విడుదల చేయండి’’ అని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు. -
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
రంగంలోకి రాజాసాబ్
‘రాజాసాబ్’ కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. -
తొలి హిందీ చిత్రం కాస్త ఆలస్యం?
భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది కీర్తి సురేశ్. త్వరలో ఆమె ‘బేబీ జాన్’తో ప్రేక్షకులను పలకరించనుంది. -
ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు
‘‘స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ‘పారిజాతపర్వం’. దీంట్లో అపరిమితమైన వినోదం ఉంది. తప్పకుండా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు హీరో చైతన్య రావు -
రెండు కోణాల్లో తమన్నా?
ది అన్టోల్డ్ స్టోరీ’, ‘రుస్తుం’, ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథా’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్ని ప్రేక్షకులకు అందించారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే. -
రామోజీ ఫిల్మ్సిటీలో అక్షయ్ సందడి
బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడీ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. -
అమితాబ్కు లతా మంగేష్కర్ పురస్కారం
పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు ఇవ్వనున్నట్లు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని వారు ఏర్పాటు చేశారు -
నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు!
‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు -
వాస్తవ జీవిత కథే ఆధారం
‘‘ప్రేమకథతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’. ఇందులో మేము ఒక కొత్త అంశాన్ని స్పృశించాం. అది తప్పకుండా ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు దర్శకుడు వీఎస్ ముఖేష్. -
కన్నడ నటుడు ద్వారకీష్ కన్నుమూత
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకనిర్మాత ద్వారకీష్(81) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మంగళవారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రముఖ సంగీత దర్శకుడు కేజీ జయన్ మృతి
ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు కేజీ జయన్(90) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ కేరళలోని త్రిపుణితురలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. -
ఆ అమ్మాయి జోలికి రావద్దు
‘‘ఆ అమ్మాయి నా ప్రాణం.. నా ఊపిరి. తన జోలికొస్తే వెతుక్కుంటూ వచ్చి నరికేస్తా’’ అని హెచ్చరిస్తున్నారు విశాల్. మరి ఆయన ప్రేమ కథేంటి? దానికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే ‘రత్నం’ చూడాల్సిందే. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
కాలేజీ ఫెస్ట్లో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్
-
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
-
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
-
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు
-
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్