Chiranjeevi: రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయాలకు పవన్కల్యాణ్ తగినవాడు అని, ఏదో ఒకరోజు పవన్ను ఉన్నతస్థాయిలో చూస్తామని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని అగ్రకథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని వైఎన్ఎం కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో మాటలు పడాలి.. అనాలి. చాలా మొరటుగా, కటువుగా ఉండాలి. ఒక దశలో నాకు రాజకీయాలు అవసరమా? అనిపించింది. రాజకీయాలకు పవన్కల్యాణ్ తగినవాడు. ఏదో ఒకరోజు పవన్ను ఉన్నతస్థాయిలో చూస్తాం’’ అని వ్యాఖ్యానించారు.
నటుణ్నికావాలని ఆ కాలేజీలోనే ఫిక్స్ అయ్యా
‘‘ఇలాంటి కార్యక్రమానికి రావడం ఇదే తొలిసారి. వీళ్లంతా ఆహ్వానించినప్పుడు కుదురుతుందో లేదోనని సందేహించా. ఎందుకంటే ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఒక్కరోజైనా విరామం ఉండదనుకున్నా. కానీ, గతంలో జరిగిన ఆత్మీయ సమావేశం గురించి తెలుసుకోవడంతో రావాలని ఆసక్తి కలిగింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే ప్రక్రియ 200 ఏళ్ల క్రితం అమెరికాలో మొదలైందట. దీని ద్వారా పూర్వ విద్యార్థులంతా కలిసి గత స్మృతులను గుర్తు చేసుకోవడం, వారు సాధించిన విజయాలు గురించి చర్చించుకోవడం, ఆ దిశగా రాణించాలనుకొనే వారికి చేయూతనివ్వడమనేది మాటల్లో చెప్పలేని అనుభూతి. కళాశాల విద్య పూర్తయ్యాక ఒక్కొక్కరూ ఒక్కో రంగంలోకి అడుగుపెట్టి ముందుకెళ్తుంటాం. భవిష్యత్తులో మనం ఏం కావాలనుకుంటున్నామో దానికి బీజం పడేది కాలేజీ రోజుల్లోనే. ఆ సమయం నుంచే నాకు నటనపై ఇష్టం ఉండేది. ఆ మక్కువ కొద్దీ ఓ నాటకం వేస్తే ఉత్తమ నటుడిగా పేరొచ్చింది. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి సినిమా రంగంలో నటుడిగా రాణించాలనే బలమైన నమ్మకానికి పునాది పడింది ‘ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల’ (వైఎన్ఎం)లోనే. బెస్ట్ యాక్టర్గా గుర్తింపు వచ్చాక అమ్మాయిలు నన్ను చూస్తుంటే పెద్ద హీరోలా ఫీలయ్యేవాణ్ని (నవ్వులు)’’
‘‘ఎన్సీసీ’లో సీనియర్ కెప్టెన్ పొజిషన్ వరకు వెళ్లా. 1976లో రిపబ్లిక్ డే సందర్భంగా క్యాంపు వెళ్లి ఆంధ్రప్రదేశ్ తరఫున రాజ్పథ్లో మార్చింగ్ చేశా. ఆ కాలేజీలోనే క్రమశిక్షణ నాకు అలవడింది. నాకు డ్యాన్స్ విషయంలో గురువులు ఎవరూ లేరు. కానీ, బెస్ట్ డ్యాన్సర్నంటూ అంతా నన్ను అంటారు. కేవలం పుస్తకాల నుంచే కాదు మన చుట్టూ ఉండే వారి నుంచీ నేర్చుకుంటూనే ఉండాలి. నా మనసుకు నచ్చితే దాని అంతు చూడటమనేది నాకు అలవాటుగా మారింది. నా మనసులోంచి రాకపోతే దాని అంతు నేను చూడలేను. అదేంటో మీకు తెలుసు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు (నవ్వుతూ..). రాజకీయాల్లో సెన్సిటివ్గా ఉంటే రాణించడం చాలా కష్టం. అవసరం ఉన్నా లేకపోయినా మాటలు అనాలి, అనిపించుకోవాలి. తను (పవన్ కల్యాణ్) తగినవాడు. అంటాడు, అనిపించుకుంటాడు. మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒకరోజు అత్యుత్తమ స్థానంలో ఉంటాడు’’ అని చిరంజీవి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM