Chiranjeevi: అప్పుడే చిత్ర పరిశ్రమ విలువేంటో బాగా తెలిసింది: చిరంజీవి
చలన చిత్ర పరిశ్రమలోనే తాను ఎదిగానని, కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తిరిగి వచ్చాక ఆ పరిశ్రమ విలువ మరింత బాగా అర్థమైందన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి
హైదరాబాద్: చలన చిత్ర పరిశ్రమలోనే తాను ఎదిగానని, కొన్నాళ్ల గ్యాప్ అనంతరం తిరిగి వచ్చాక ఆ పరిశ్రమ విలువ మరింత బాగా అర్థమైందన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi). ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ (First Day First Show) ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ అయిన శ్రీజ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన సినిమా ఇది. నూతన హీరో హీరోయిన్లతో వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబరు 2న విడుదల కానుంది.
నేను రావటానికి కారణం ఆయనే..
‘‘నేను ఈ వేడుకకు రావటానికి ప్రధాన కారణం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. ఆయన ఇక్కడే ఉండి, మనందరికీ ఆశీస్సులు అందిస్తుంటారని ప్రగాఢంగా నమ్ముతూ ఆయనకు నమస్కరిస్తున్నా. ఆయనతో నాకు సినిమాయేతర అనుబంధం ఉంది. వారి కుటుంబంలో నేను ఓ సభ్యుడిగా ఉండేవాణ్ని. తన నిర్మాణ సంస్థలో పనిచేసిన వారందరిపైనా నాగేశ్వరరావు ప్రేమ కురిపించేవారు. మనమంతా గర్వించదగ్గ పూర్ణోదయ బ్యానర్లో నేను రెండు సినిమాల్లో నటించా. నా కెరీర్ ప్రారంభంలో ఈ ప్రొడక్షన్ హౌజ్లో ‘తాయారమ్మ బంగారయ్య’ సినిమాలో చిన్న పాత్ర పోషించా. నాగేశ్వరరావు అభిరుచికి తగ్గట్టే దర్శకులు సినిమాలు తెరకెక్కించేవారు. అలా కె. విశ్వనాథ్- నాగేశ్వరరావు కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలొచ్చాయి. ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, నేను నటించిన ‘స్వయంకృషి’.. ఇలా ఎన్నో సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. అల్లు రామలింగయ్య, ఏడిద నాగేశ్వరరావు కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఏడిద కుటుంబ సభ్యులు ఇప్పటికీ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూస్తుంటారు. నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమా ఫంక్షన్కు రావటం నాకు చాలా సంతృప్తిగా ఉంది’’
‘‘చిత్ర పరిశ్రమలోనే నేను ఎదిగా. మీ అందరి ప్రేమానురాగాలు పొందా. మరో రంగానికి వెళ్లి కొంత గ్యాప్ అనంతరం తిరిగి వచ్చా. అప్పుడు సినీ పరిశ్రమ విలువ మరింత ఎక్కువగా తెలిసింది. సినిమా.. చాలా గొప్పది. ప్రతిభను ఆయుధంగా చేసుకునే ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునే పరిశ్రమ ఇది. అలాంటి ఈ ఇండస్ట్రీలో నేను ఓ స్థానాన్ని సంపాదించుకోవటంతో నా జన్మ సార్థకత అయిందనుకుంటా. ‘సినీ పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలి.. మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి’ అనుకుంటూ కష్టపడిన ప్రతి ఒక్కరూ ఇక్కడ విజయం అందుకున్నారు. అలా కాకుండా ‘అనుకుంటే అయిపోతుంది’ అని తేలిగ్గా తీసుకుంటే ఇండస్ట్రీ కూడా అంత తేలిగ్గానే తీసుకుంటుంది. బయటకు వెళ్లేందుకు దారి చూపిస్తుంది. అకుంటిత సాధన, మొక్కవోని దీక్ష, పట్టుదల లేనిరోజున పరిశ్రమకు గుడ్బై చెప్పి వెళ్లిపోవడం నయం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహాన్ని చూస్తున్నా. వీరంతా అభివృద్ధిలోకి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా’’ అని చిరంజీవి అన్నారు. ఈ సినిమాకి కథ అందించిన ‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్ కేవీ, సంగీత దర్శకుడు రథన్ను కొనియాడారు.
మహిళలు ఇండస్ట్రీలోకి రావాలి..
‘‘పరిశ్రమలోకి మహిళలు వస్తున్నారంటే నేను ప్రోత్సహిస్తా. మా కుటుంబంలోని ఆడ పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి వస్తానంటే ‘ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ.. తప్పకుండా రండి’ అని ఆహ్వానించా. తెలుగు చిత్ర పరిశ్రమ మహిళలకు ఎంతో గౌరవం ఇస్తుంది. దాని గురించి ఇతర పరిశ్రమవారు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే మహిళలు రావాలి.. తామెంటో నిరూపించుకోవాలి’’
కంటెంట్ బాగుండాలి..
‘‘కొవిడ్ కాలం నుంచి ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అది అపోహ మాత్రమే. ఆడియన్స్ సినిమాలను ఓటీటీలో చూస్తున్నా, యూట్యూబ్లో వీక్షిస్తున్నా.. సరే థియేటర్లకు వెళ్లి చూడాలనుకుంటున్నారు. సినిమా కంటెంట్ బాగుంటే వారు తప్పకుండా థియేటర్లకు వస్తారు. అలాంటి మంచి కథలు మనం చెప్పగలగాలి. ఇటీవల విడుదలైన సినిమాలు ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ అలా వచ్చినవే. మంచి స్టోరీలు చెప్పగలిగినప్పుడు ‘సినిమా ఫిలాసఫీ మారిపోయింది.. ఇంట్లోనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు’ అని మనం అనుకోవాల్సిన పనిలేదు. కంటెంట్ బాగుంటే తప్పకుండా వస్తారు లేదంటే రెండో రోజే సినిమా పోతుంది. ఆ విషయంలో నేనూ బాధితుణ్నే (నవ్వుతూ..). పరిశ్రమను నడిపించాలంటే దర్శకులే పూనుకోవాలి. ‘ఎందుకు సినిమా హిట్ అయింది.. ఎందుకు ఫ్లాప్ అయింది’ అని చర్చించుకుంటుండాలి. ‘ఇందులో ఏం ఉందని ప్రేక్షకులు చూడాలి’ అని తమ కథలను తాము ప్రశ్నించుకోవాలి. సమాధానం అదే చెబుతుంది. నటుల డేట్స్ అందాయని చకచకగా సినిమాలు తీయొద్దు. జాగ్రత్తగా ఉంటే హిట్లు వస్తాయి’’ అని చిరంజీవి ప్రసంగించారు. అనంతరం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు