Chiranjeevi: నిర్మాతల డబ్బును బుట్టదాఖలు చేయవద్దు.. దర్శకులకు చిరంజీవి సూచన
Chiranjeevi: తెలుగు సినీ దర్శకులు అగ్ర కథానాయకుడు చిరంజీవి కీలక సూచన చేశారు. నిర్మాతల డబ్బును బుట్టదాఖలు చేయకుండా జాగ్రత్తగా సినిమా తీయాలని సూచించారు.
హైదరాబాద్: నిర్మాతల డబ్బును బుట్టదాఖలు చేయవద్దని, సినిమాకు కావాల్సినవన్నీ పేపర్వర్క్లోనే పూర్తి చేసేయాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి దర్శకులకు సూచించారు. సినీ పరిశ్రమ బాగుండాలని దర్శకులు గుర్తించాలన్నారు. నిర్మాతలు బాగుంటేనే నటీనటులు బతుకుతారని హితవు పలికారు. చిరంజీవి (Chiranjeevi), రవితేజ (Ravi teja) కీలక పాత్రల్లో బాబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శ్రుతిహాసన్ కథానాయిక. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ సక్సెస్మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ‘‘వాల్తేరు వీరయ్య’ విజయంతో నా మాటలు కొరవడ్డాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మనం మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు మాటలు విద్దాం. ప్రేక్షకుల ఉత్సాహమే మన ఇంధనం. సినిమా యూనిట్ అంతా థియేటర్లకు వెళ్లాలి. నేను కష్టపడలేదు, నా బాధ్యతగా అనుకుని పనిచేశా. కష్టం నాది, రవితేజది కాదు... సినిమా బాగా రావాలని పనిచేసిన వారిది. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పనిచేసిన కార్మికులది. మన మీదతో జాలితో కాదు... సినిమాపై ప్రేమతో కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి. విజయాలు వస్తుంటాయి పోతుంటాయి, కార్మికుల కష్టం తెలియాలి. బాబీ చెప్పిన కథ అందరికీ నచ్చింది. ఆ తర్వాత పర్సనల్గా మాట్లాడాలని బాబీని నా గదికి తీసుకెళ్లా. ‘ఈ కథ జస్ట్ బిలో యావరేజ్. ఇది ఒక ముడి వజ్రం. ఇది పెట్టుకుని మనం ఏమీ చేయలేం. దీనిని అందమైన ఆభరణంగా మార్చాలి. చాలా కష్టపడాలి. నువ్వు స్క్రిప్ట్ పూర్తి చేసిన ప్రతిసారీ నాకు చెప్పు. నచ్చితే ముందుకు వెళ్దాం. లేకపోతే మళ్లీ మార్పులు చేసుకుని రావాలి’ అన్నప్పుడల్లా ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఇలా చెబితే, ఎవరికైనా అహం అడ్డువస్తుంది. ఇంతకన్నా బాగా ఉంటుందా? అని సంతృప్తిపడిపోతారు. అలా జరిగితే, దాంతో స్థాపితం అయిపోయినట్లే. కానీ, బాబీ అలా చేయకుండా ప్రతి సీన్ను సంపూర్ణం అయ్యేలా మార్పులు చేసుకుంటూ వెళ్లాడు. నిజంగా ఇదొక కేస్ స్టడీగా యువ దర్శకులు చూడాలి’’
‘‘కోర్టులో ప్రకాశ్రాజ్ తలనరకడానికి కావాల్సిన బలమైన కారణం కనపడటం లేదు’ బాబీకి అని చెప్పా. మళ్లీ టీమ్ అంతా కూర్చొని మార్పులు చేశారు. అదే విషయం నాకు చెబితే, ‘అది కూడా సరిపోదు. తలనరికేంత కోపం రావాలంటే ఇంకేదో వర్క్ చేయాలి’ అన్నాను. రాత్రి 2గంటల వరకూ కూర్చొన్ని ఇంకొన్ని మార్పులు చేశారు. అప్పుడు ఓకే చెప్పా. 44 సంవత్సరాల అనుభవానికి బాబీ విలువ ఇవ్వడం అతని గొప్పతనం. ‘ఇది నా కథ. ఆర్టిస్ట్లుగా వాళ్లు చెప్పేదేంటి? నేను ఎలా చెబితే అలా నటించాలి’ అన్న గర్వం అతనిలో లేదు. అందరూ కలిసి కథకు సరెండర్ అయ్యారు. అందుకనే అనుభవం ఉన్న వ్యక్తులు అనుమానం వ్యక్తం చేస్తే, విలువ ఇచ్చి, మార్పులు చేశాడు. సినిమాలో అదనంగా సీన్స్ ఉంటే, ఆ పేపర్లను చింపేసి పారేయమని చెప్పేవాడిని. అనవసరంగా సీన్లు తీసి, నిర్మాతల డబ్బు, సమయాన్ని బుట్టదాఖలు చేయొద్దని చెప్పా. ఇలా చెబితే వినేవాళ్లు ఇప్పుడు తగ్గిపోయారు. ‘అరగంట సినిమా ఎడిటింగ్ రూమ్లో పక్కన పడేశాం’ అనే మాటలు వింటూనే ఉన్నాం. మా సినిమా ఏడున్నర నిమిషాలు.. మహా అయితే, పది నిమిషాలు పక్కన పెట్టాం. యాక్షన్ సన్నివేశాల్లో కాస్త ఎక్కువ తీశాం తప్ప, నిర్మాతలకు నయా పైసా వృథా కాలేదు’’
‘‘నేను అనే మాటలకు చిన్నా, పెద్ద దర్శకులు హర్ట్ అవుతారేమో, ‘సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం కాదు.. నిర్మాతలకు చెప్పిన బడ్జెట్లో పూర్తి చేసి ఇవ్వాలి. అదే మొదటి సక్సెస్. కొత్త టెక్నాలజీ వాడి పనితనం చూపించే కంటే, కథను నమ్మి సాధారణ కెమెరాతోనూ గొప్ప సినిమా తీయాలి. ఏదైనా అవసరం మేరకు తీసుకోవాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే, బాధ్యత తీసుకునేవాళ్లు, అది గుర్తించాల్సిన వాళ్లు దర్శకులు మాత్రమే. ప్రతి వాళ్లు ఆలోచించాలి. నేను ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడటం లేదు. దీన్ని మీడియా వేరే వాళ్లకు, వాటికి ఆపాదించవచ్చు. సత్తా ఉన్నా దర్శకులు ఒక సినిమాకు ఎక్కువ సన్నివేశాలు తీస్తే, దాన్ని పార్ట్-2 మలుచుకోగలుగుతున్నారు. అలా ‘పొన్నియిన్ సెల్వన్’, ‘బాహుబలి’ చిత్రాలకు కుదిరింది. ఇవన్నీ మాట్లాడి కొంచెం క్లాస్ ఎక్కువ తీసుకున్నాననుకుంటా. ఏదేమైనా నిర్మాతలు బాగుండాలి. వాళ్లు బాగుంటేనే మళ్లీ సినిమాలు చేస్తారు. నా తమ్ముడు రవితేజ లేకపోయుంటే, ఈ సినిమా సెకండాఫ్లో ఇంత అందం వచ్చేది కాదు. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్లే థ్యాంక్స్ చెబుతున్నారు.’’ అని చిరంజీవి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత