Chiranjeevi: కిక్కిచ్చే పోరాటం

చిరంజీవి కథానాయకుడిగా ఆయన 154వ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. కె.ఎస్‌.రవీంద్రనాథ్‌ (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని,  వై.రవిశంకర్‌ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.

Updated : 28 Mar 2022 09:48 IST

చిరంజీవి కథానాయకుడిగా ఆయన 154వ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. కె.ఎస్‌.రవీంద్రనాథ్‌ (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని,  వై.రవిశంకర్‌ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. విరామానికి ముందు వచ్చే ఈ పోరాట దృశ్యాల చిత్రీకరణలో చిరంజీవితోపాటు, శ్రుతిహాసన్‌ పాల్గొంటున్నారు. ప్రముఖ ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో వీటిని తెరకెక్కిస్తున్నారు. ‘‘మాస్‌, యాక్షన్‌ అంశాలతో రూపొందుతున్న చిత్రమిది. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి.  ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తించేలా ఉంటాయి. అభిమానులతోపాటు, మాస్‌ ప్రేక్షకులకి కిక్‌ఇచ్చేలా ఉంటాయి. ఈ చిత్రం చిరంజీవిని మరో సరికొత్త మాస్‌ పాత్రలో ఆవిష్కరిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: నిరంజన్‌ దేవరమానె, ఛాయాగ్రహణం: ఆర్ధర్‌ ఎ.విల్సన్‌, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, చక్రవర్తి రెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని