Avasarala srinivas: ‘బాలా’ కన్నా ముందు రావాల్సింది!
‘నూటొక జిల్లాల అందగాడు’ సినిమా గురించి అవసరాల శ్రీనివాస్ మీడియాతో పంచుకున్న సినిమా కబుర్లు..
‘అష్టాచమ్మా’తో నటుడిగా తెలుగు తెరకు పరిచయమై దర్శకుడిగా, రచయితగా ప్రత్యేకతను చాటుకున్నారు శ్రీనివాస్ అవసరాల . ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలతో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా మారిపోయారాయన. ఇప్పుడు రచయితగా, హీరోగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
‘‘బాలా’ విడుదలకు ముందే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాను ప్రారంభించాం. ఆ సినిమా వస్తుందని తెలిసి, దానికి పోటీగా ఒకేసారి విడుదల చేద్దామనుకున్నాం. కానీ ‘బాలా’, ‘ఉజ్డా చమన్’ సినిమాలు పోటీపడి విడుదల చేయడంతో మేం వెనక్కి తగ్గాం. ఆ తర్వాత లాక్డౌన్ కారణంగా వాయిదా పడి మళ్లీ ఇప్పుడు విడుదలవుతోంది. బాలా విడుదలైనప్పుడు సినిమాలో మార్పులేవైనా చేయాల్సి ఉంటుందేమోనని చూశాను. మా కథకు దానికి పొంతన కనిపించలేదు. కానీ ‘బాల’ కన్నా ముందు వచ్చి ఉంటే బాగుండేది. అందరూ మీ సినిమా రీమేకా? అని అడుగుతున్నారు. ముందే వచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు’’
క్రిష్ మెచ్చిన కథ
‘‘రంగు, ఎత్తు, రూపాలపై మన సమాజం నుంచి ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తుండటం సహజం. స్నేహితుల మధ్య ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. వీటి కారణంగా ఆత్మవిశ్వాసం దెబ్బతిని కుంగిపోయిన వాళ్లున్నారు. తేలికగా తీసుకున్నప్పటికీ ఆకర్షణీయంగా ఉండమనే భావన కొందరిని జీవితాంతం వెంటాడుతుంది. ఈ భావన తప్పు అని చెప్పాలనిపించింది. ‘జ్యో అచ్యుతానంద’ కథా చర్చల సమయంలోనే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఆలోచనను క్రిష్తో పంచుకున్నాను. బాగుందనడమే కాదు, స్వయంగా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ కథకు ‘అందమే ఆనందం’ టైటిల్ పెట్టాలనుకున్నాం. క్రిష్ గారే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అయితేనే బాగుంటుందని పట్టుపట్టారు’’
అందుకే దర్శకత్వం చేయలేదు
‘‘దర్శకుడిగా మూడో చిత్రం షూటింగ్ సగం వరకు పూర్తయింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను దర్శకుడిగా దీన్ని తెరకెక్కించడం బిజినెస్పరంగా బాగుండదని అనిపించింది. విద్యాసాగర్ నా గత చిత్రాలకు అసోసియేట్గా చేశారు. ఆయనైతే ఈ సినిమాకు న్యాయం చేస్తారనిపించింది. కథ నేనే రాసిన దర్శకత్వంలో వేలు పెట్టలేదు. రుహాని శర్మ నటించిన చి.ల.సౌ. చూశాను. ఆ సినిమాలో చాలా బాగా నటించింది. వేరే సినిమా కోసం ఆమెను సంప్రదించాను. అది వర్కౌట్ కాలేదు. చిత్ర నిర్మాతలకు తనను హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందని చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. మా సినిమాలోనూ బాగానే నటించింది. ఈ సినిమా ద్వారా ప్రత్యేకంగా సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించలేదు. సినిమాకు ఎంత డబ్బుల వస్తాయో పక్కనపెడితే, కానీ, జనాలు తేలిక పడితే విజయం సాధించినట్టే. ఒక్క సినిమాతో ప్రపంచంలో సమస్యలు పరిష్కారమవవు. కానీ ఇలాంటి అవగాహన కల్పించడం వల్ల మెల్లమెల్లగా మార్పొస్తుంది. అలాంటి మార్పు తేగలిగితే చాలు’’
అందుకే ఆలస్యం
‘‘ఊహలు గుసగులాడే’ సినిమాను రాసేందుకు మూడేళ్లు పట్టింది. ఆ తర్వాత ‘జ్యో అచ్యుతానంద’కు రెండేళ్లు పట్టింది. అందుకే సినిమాలు ఆలస్యమవుతున్నాయి. నాకు కొన్ని పాత్రలకే పరిమితం అవ్వాలని ఉండదు. నటుడిగా ప్రత్యేక ముద్ర ఉండటం ఇష్టం లేదు. భిన్నమైన పాత్రల్లో నటించి నిరూపించుకోవాలని ఉంటుంది. అందుకే ‘జెంటిల్మెన్’లో విలన్గా చేశా, ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో కూడా అందుకే నటించాను. మరో నాలుగు కథలు రాసి పెట్టుకున్నాను. ఈ సినిమా తర్వాత వాటి మీదే దృష్టి పెడదామని నిర్ణయించుకున్నాను’’
రచయితగానే ఎక్కువ సంతృప్తి
‘‘క్రిష్గారు చేయడం వల్ల సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఎడిటింగ్లో ఆయన ఇచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. నా మూడో సినిమా ‘ఫలాన అబ్బాయి, ఫలానా అమ్మాయి’ 50 శాతం పూర్తయింది. మిగతాది అమెరికాలో చేయాల్సి ఉంది. అది బహుశా వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశముంది. కలల ప్రాజెక్టు అంటూ ఏం లేదు. ఆ సమయానికి ఎలాంటి కథ చెబితే బాగుంటుందనే ఆలోచిస్తాను. నటుడిగా, దర్శకుడిగా కన్నా రచయితగానే ఎక్కువ సంతృప్తి దొరికింది. అమెజాన్ ప్రైమ్ కోసం నిత్యామేనన్తో కలిసి ఓ షో చేయాల్సి ఉంది. అక్టోబర్లో షూటింగ్ ప్రారంభమౌతుంది. ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఆద్యంతం నవ్విస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!