Cinema News: సంక్షిప్త వార్తలు(7)
కార్తికేయ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘బెదురులంక 2012’. నేహాశెట్టి కథానాయిక. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు.
యుగాంతం నేపథ్యంలో...
కార్తికేయ (Kartikeya) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహాశెట్టి కథానాయిక. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మాత. సి.యువరాజ్ సమర్పిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ని కథానాయకుడు నాని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఒక పల్లెటూరి నేపథ్యంలో జరిగే కథ ఇది. 2012లో యుగాంతం ఖాయం అంటూ సాగిన ప్రచారం ఈ కథలో కీలకాంశం. ప్రేక్షకుల్ని బెదురులంక అనే ఓ కొత్త ప్రపంచంలోకి సినిమా తీసుకెళుతుంది. కాకినాడ, యానాం, గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ‘‘బలమైన కథతోపాటు కడుపుబ్బా నవ్వించే వినోదం ఉన్న చిత్రమిద’’న్నారు.
తండ్రీ తనయుల కథ
శాంతి చంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డర్టీ ఫెలో’ (Dirty Fellow). దీపిక సింగ్, శిమ్రితి బతీజా, నిక్కీషా రంగ్వాలా కథానాయికలు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్నారు. జి.ఎస్.బాబు నిర్మాత. బుధవారం హైదరాబాద్లో టైటిల్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథిగా హాజరై లుక్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు చేరువయ్యేలా ఉంది ఈ పేరు. నటులు, చిత్రబృందం సినిమా కోసం తపనతో పనిచేశార’’న్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘తండ్రి, తనయుల కథ ఇది. సమాజానికి హానికరంగా మారిన తనయుడి విషయంలో ఓ తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆసక్తికరం’’ అన్నారు. ‘‘కథానాయకుడు శాంతిచంద్ర, సంగీత దర్శకుడు డా.సతీష్ల సహకారంతో ఈ సినిమాని అనుకున్నట్టుగా పూర్తి చేశాం’’ అన్నారు.
ఆర్థిక నేరాల చుట్టూ...
సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్ ప్రధాన పాత్రధారులుగా... పాన్ ఇండియా స్థాయిలో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రియ భవానీ శంకర్, సత్య అకల, సునీల్ వర్మ, జెనిఫర్ పిచినెటో ముఖ్య పాత్రలు పోషించారు. ‘పెంగ్విన్’ ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎన్.రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. పేరు ఖరారు కాని ఈ సినిమా చిత్రీకరణ తొలి షెడ్యూల్ పూర్తయింది. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. నాణ్యమైన చిత్రాల్ని అందించడం కోసం చెన్నై, హైదరాబాద్ నగరాలకి చెందిన మా రెండు నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఆర్థిక నేరాల చుట్టూ సాగే ఈ కథ ప్రేక్షకులకి థ్రిల్ని పంచుతుంది. తెలుగు, కన్నడ, తమిళంతోపాటు, హిందీ, మలయాళం భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని చెప్పారు నిర్మాతలు.
ప్రతీకార ఆక్రోశం
అరుణ్ విజయ్ కథానాయకుడిగా... జి.ఎన్.ఆర్.కుమారవేలన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆక్రోశం’ (Aakrosham). పల్లక్ లల్వాని కథానాయిక. సీహెచ్ సతీష్కుమార్తో కలిసి ఆర్.విజయ్కుమార్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ప్రతీకారం నేథ్యంలో యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుగా రూపొందిన చిత్రమిది. తమిళంలో ‘సినం’ పేరుతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి విభిన్నమైన కథల్ని తప్పక ఆదరిస్తారు. అరుణ్ విజయ్ నటించిన ‘ఏనుగు’ చిత్రాన్ని మేమే విడుదల చేశాం. మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
టాప్గన్: మేవరిక్ మళ్లీ థియేటర్లలో
ట్రామ్క్రూజ్ నుంచి హిట్ చిత్రం ‘టాప్గన్: మేవరిక్’ (Topgun) మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించనుంది. వేసవి కానుకగా వచ్చి భారీ వసూళ్లు అందుకుందీ చిత్రం. ‘పారామౌంట్’ సంస్థలో భారీ వసూళ్లు అందుకున్న చిత్రాల్లో ముందు వరసలో నిలిచింది. ప్రేక్షకులకు మరోసారి వినోదాన్ని పంచడానికి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 2 నుంచి 15 వరకూ ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. ఎందుకంటే 16 నుంచి అవతార్: ది వే ఆఫ్ వాటర్ హంగామా మొదలుకాబోతుంది.
తమిళ చిత్రం ‘కేడీ’ రీమేక్లో అభిషేక్బచ్చన్?
తమిళ చిత్రం ‘కేడీ’ ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ పురస్కారాలను సైతం ఈ చిత్రం గెలుచుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట ప్రముఖ దర్శకనిర్మాత నిఖిల్ అద్వానీ. ఇందులో హిందీ కథానాయకుడు అభిషేక్బచ్చన్ నటినున్నట్లు సమాచారం. మాతృకకు దర్శకత్వం వహించిన మధుమిత సుందరరామన్ హిందీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయని, జనవరిలో భోపాలలో చిత్రీకరణ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఓ పెద్దాయన, ఓ ఎనిమిదేళ్ల కుర్రాడి నేపథ్యంలో సాగే కథే ‘కేడీ’. ఇందులో వృద్ధుడి పాత్రలోనే అభిషేక్ నటించనున్నారట.
వారసుడితో వయ్యారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్ శర్మ
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ఖాన్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్’. దీని ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ
‘హనుమాన్’ (Hanuman) విజయంపై మరోసారి స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma). ఈ సినిమా విడుదలై వందరోజులు దాటిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్కు రాలేదు. -
రామ్చరణ్ అంటే నాకెంతో ఇష్టం..: బాలీవుడ్ నటి
నటుడు రామ్చరణ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. -
దావుద్ పార్టీలో డ్యాన్స్.. అక్షయ్కుమార్ సతీమణి ఏమన్నారంటే..?
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం(Dawood Ibrahim) కోసం అక్షయ్ కుమార్ సతీమణి, నటి ట్వింకిల్ ఖన్నా డ్యాన్సులు చేసినట్లు దాదాపు పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
‘టైగర్’తో సవాల్ ఎదుర్కొన్నా
‘‘ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా ఒక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను గళంలో వినిపించడం ఎంతో సవాలుతో కూడిన పని’’ అంటోంది కథానాయిక ప్రియాంక చోప్రా. హాలీవుడ్, బాలీవుడ్లో తన నటనా ప్రతిభను నిరూపించుకున్న ఈమె.. -
పద్దెనిమిదేళ్ల తర్వాత జోడీగా..
ఆఫ్స్క్రీన్, ఆన్స్క్రీన్లో హిట్ జోడీ అయిన సూర్య, జ్యోతిక తమిళంలో ‘పూవెల్లం కేట్టుప్పార్’ మొదలుకొని ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి, మెప్పించారు. -
రజనీ చిత్రంలో నాగ్?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీ 171వ సినిమా ఇది. సోమవారం పేరుని ప్రకటిస్తున్నారు. -
అశ్వత్థామగా అమితాబ్
‘‘ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను. ద్రోణాచార్య తనయుడిని’’ అంటూ అశ్వత్థామ పాత్రలో పరిచయం అయ్యారు అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్. -
ఆ కళే.. నాకు థెరపీలాంటిది!
అందం.. నటనే కాదు.. అలవోకగా చిత్రాలు గీయగల సృజనశీలి నభా నటేశ్. తనకు మానసిక ప్రశాంతతనిచ్చేవి ఈ పెయింటింగ్సే అంటోందామె. -
యానిమల్ పార్క్ 2026లో..
‘యానిమల్’ సంచలన విజయంతో యావత్తు సినీ పరిశ్రమ దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్రెడ్డి వంగా. బాక్సాఫీసు రికార్డు వసూళ్లతోపాటు విమర్శలూ ఎదుర్కొందీ చిత్రం. -
మూర్తి కలల ప్రయాణం
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. -
విధిని తిరగరాసే ఫరీదాన్
‘హీరామండీ: ది డైమండ్ బజార్’లో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ సిరీస్ బృందం. -
‘రెయిన్బో’ డ్రెస్సులో పాయల్.. సోఫాలో మానస.. ఊయలూగుతూ శివాత్మిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది.
తాజా వార్తలు (Latest News)
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదుల కూల్చివేత.. అడ్డుకున్న తెదేపా
-
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
-
‘పచ్చని’ పోలింగ్ బూత్.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!
-
చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్తో దౌత్యం జరిపేనా!