Bigg Boss 5: లోబో ఎలిమినేట్.. తప్పు చేసిన వాళ్లు ఉంటున్నారు.. ఆఖర్లో ట్విస్ట్
శనివారం ‘బిగ్బాస్’ హౌస్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీకెండ్స్లో వ్యాఖ్యాతగా నాగార్జున
Bigg Boss Telugu 5: శనివారం ‘బిగ్బాస్’ హౌస్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీకెండ్స్లో వ్యాఖ్యాతగా నాగార్జున వచ్చి అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వారం ఆయన పూర్తిగా పెదరాయుడి అవతారంలోనే ఉండిపోయారు. గత వారం రోజులుగా హౌస్మేట్స్ పనితీరును విశ్లేషిస్తూ తప్పు చేసిన వారిని కడిగిపారేశారు. ముఖ్యంగా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్ విషయంలో రవి, శ్వేత, లోబోల వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వచ్చి రావడంతోనే లోబోను నిలబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘రవి చెబితేనే వెళ్లి కుషన్ కట్ చేసి, తీసుకొచ్చా’ అని లోబో చెప్పగా, ‘రవి గడ్డి తినమంటే తింటావా’ అని నాగ్ మండిపడ్డారు. ‘కుషన్లోని దూదిని తీసుకొచ్చిన విషయం నీకు తెలియదు అని చెప్పకు’ అని శ్వేత అనగా, రవి ఏమీ తెలియనట్టు ముఖం పెట్టాడు. ‘ఇవన్నీ చూస్తుంటే నటరాజ్ మాస్టర్ చెప్పిందే(రవిని గుంటనక్క అన్నారు) కరెక్ట్ అనిపిస్తోంది’ అని నాగార్జున అనడంతో రవి చిన్నబోయాడు. ‘సంచాలకులైన కాజల్, సిరి ఈ విషయంలో రవిని నమ్మాలా? వద్దా’ అని నాగార్జున అడిగారు. కుషన్లో ఉన్న కాటన్కు, గేమ్లో ఇచ్చిన కాటన్కూ తేడా ఉందని నిరూపించారు. దీంతో రవి ఒక్కడే నిందితుడిలా నిలబడిపోయాడు. ఏదైనా మాట్లాడితే ఏ వీడియో బయటకు వస్తుందోనని రవి మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇక నామినేషన్స్ సందర్భంగా ‘మీరంతా నటులు’ అంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపైనా నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ‘యాక్టర్ అంటే చిన్న చూపా’ అంటూ శ్రీరామ్ను ప్రశ్నించారు. అందుకు శ్రీరామ్ సారీ చెప్పాడు.
ప్రియ, లోబోలను నామినేట్ చేసిన హౌస్మేట్స్
శనివారం నాగార్జున మరో ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చారు. హౌస్మేట్స్ అందరినీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి, ఇంట్లో ఉండేందుకు అర్హతలేని ఒకరి పేరు చెప్పాలని సూచించారు. మొదట మానస్.. శ్రీరామ్ను నామినేట్ చేయగా, ప్రియను సన్నీ, కాజల్, విశ్వ, లోబోలు నామినేట్ చేశారు. గత కొద్ది రోజులు లోబో సరిగా ఆడటం లేదంటూ అనీ మాస్టర్, శ్వేత, సిరి, షణ్ముఖ్లు అతడిని నామినేట్ చేశారు. దీంతో ప్రియ, లోబోలకు చెరి నాలుగు ఓట్లు వచ్చాయి. వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని, చివరిగా ఎవరు హౌస్లో ఉండాలనుకుంటున్నారో ఇంటి సభ్యులు చెప్పాలని నాగార్జున ఆదేశించాడు. దీంతో రవి, సన్నీ, విశ్వ, కాజల్లు లోబో పక్కన నిలబడగా, మిగిలిన వాళ్లందరూ ప్రియకు సపోర్ట్చేయడంతో లోబో ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అనీ మాస్టర్ ఎటూ తేల్చుకోలేకపోతుండటంతో ‘అనీ.. త్వరగా నీ నిర్ణయం చెప్పు.. కన్ఫెషన్ రూమ్లోనూ ఇలాగే చేశావ్’ అంటూ గట్టి చెప్పారు. దీంతో ప్రియకు అనీ సపోర్ట్ చేసింది.
తప్పు చేసిన వాళ్లు ఉంటుంటున్నారంటూ ఏడ్చిన విశ్వ
లోబో ఇంటి నుంచి బయటకు వెళ్లాలని నాగార్జున చెప్పడంతో విశ్వ తట్టుకోలేకపోయాడు. ఆ మాట వినడంతో ఏడుపు మొదలు పెట్టాడు. ‘తప్పు చేసిన వాళ్లు ఉంటున్నారు. లోబోను ఎందుకు పంపిస్తున్నారు’ అంటూ భోరున విలపించాడు. లోబోకు మద్దతు ఇవ్వని హౌస్మేట్స్ అతడికి సారీ చెప్పారు. ఇన్ని రోజులు హౌస్లో ఉన్న సమయంలో తెలిసి కానీ, తెలియక కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని లోబో హౌస్మేట్స్ను కోరాడు.
ఏదో తేడాగా ఉందే...!
సాధారణంగా ఎలిమినేట్ అయిన సభ్యులు వేదికపైకి రాగానే బిగ్బాస్ హౌస్లో వాళ్ల జర్నీ వీడియోను ప్రసారం చేయటం అలవాటు కానీ, నాగార్జున అదేమీ చూపించకుండా నేరుగా లోబోను ఇంటి సభ్యులతో మాట్లాడించారు. ‘ఏదో తేడాగా ఉందే’ అనిచూస్తున్న ప్రేక్షకులకు అర్థమైంది. ఇలోగా థంబ్స్ అప్.. డౌన్ అంటూ సింబల్ ఇచ్చి హౌస్మేట్స్కు రేటింగ్ ఇవ్వాలని నాగార్జున సూచించగా, లోబో అందరికీ థంబ్స్ అప్ ఇచ్చాడు. తనకి సపోర్ట్ చేయని వారి గురించి కూడా పాజిటివ్గా మాట్లాడాడు. బస్తీ నుంచి వచ్చిన తనని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు. ఆ తర్వాత హౌస్మేట్స్కు వీడ్కోలు పలికి స్టేజ్ వీడేందుకు ప్రయత్నించాడు. అప్పుడు నాగార్జున నవ్వుతూ లోబోను వెనక్కి పిలిచి, ‘నిన్ను ఎలిమినేట్ చేయడానికి బిగ్బాస్ ఎవరు? హౌస్మేట్స్ ఎవరు? ఏది చేసినా ప్రేక్షకులు నిర్ణయమే అంతిమ తీర్పు. నువ్వు ఎలిమినేట్ కావటం లేదు. సీక్రెట్ రూమ్లోఉంటున్నావ్. బిగ్బాస్ చెప్పినప్పుడు మళ్లీ హౌస్లోకి వెళ్తావ్’ అని చెప్పాడు. దీంతో మరోసారి లోబో ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు