Tollywood: తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న సినిమా థియేటర్లు

తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. కరోనా ఉద్ధృతి కాస్త అదుపులోకి రావడంతో రెండు రాష్ట్రాలు..

Updated : 30 Jul 2021 14:06 IST

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. కరోనా ఉద్ధృతి కాస్త అదుపులోకి రావడంతో రెండు రాష్ట్రాలు.. సినిమాల ప్రదర్శనలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం సామర్థ్యంతో రోజుకు 3 ఆటల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో 100 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడుస్తున్నాయి. నేటి నుంచి తిమ్మరుసు, ఇష్క్‌, నరసింహాపురం చిత్రాలను ఆయా సినిమా హాళ్లలో ప్రదర్శిస్తున్నారు. అయితే సినిమా థియేటర్లలో మందకొడిగా ప్రేక్షకులు కనిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని