Tollywood: సినీ ప్రముఖుల కీలక భేటీ

తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకునేందుకు ఆదివారం ఉదయం సినీ ప్రముఖులందరూ భేటీ అయ్యారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌...

Updated : 20 Feb 2022 12:13 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు  ఆదివారం ఉదయం సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ప్రారంభమైన ఈ సమావేశంలో 24 క్రాఫ్ట్‌లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. దర్శకుడు రాజమౌళి, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్‌, ప్రసన్న కుమార్‌, నట్టికుమార్‌ తదితరులు హాజరైన ఈ భేటీలో పరిశ్రమలో అంతర్గతంగా ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. వరుస సినిమా విడుదలలు, ఏపీలో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం నేపథ్యంలో ఈ భేటీ ప్రధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని