కొవిడ్‌ ఎఫెక్ట్‌.. షూట్‌ నిలిపివేత

బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం సినిమా షూట్‌ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ముంబయి పోలీసులు ఆయన షూటింగ్‌ను అడ్డుకున్నారు. జాన్‌ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌‌’. దిశాపటానీ కథానాయిక....

Published : 06 Mar 2021 18:37 IST

 

ముంబయి: బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహాం సినిమా షూట్‌ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ముంబయి పోలీసులు ఆయన షూటింగ్‌ను అడ్డుకున్నారు. జాన్‌ అబ్రహాం కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌‌’. దిశాపటానీ కథానాయిక. మోహిత్‌ సూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ క్రమంలోనే వర్లీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే, కొవిడ్‌-19 నిబంధనలు పాటించకుండా షూట్‌ చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు.. లొకేషన్‌ వద్దకు చేరుకుని షూట్‌ని నిలిపివేశారు. అంతేకాకుండా, నటీనటుల్ని అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని