‘ఇండియన్‌ 2’ తిరిగి సెట్స్‌పైకి!

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ మొదలుపెట్టిన ‘ఇండియన్‌ 2’ కొన్ని నెలలుగా ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాను మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లే సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో...

Published : 23 Apr 2021 10:10 IST

చెన్నై: కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ మొదలుపెట్టిన ‘ఇండియన్‌ 2’ కొన్ని నెలలుగా ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాను మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లే సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇటీవలే మరణించిన ప్రముఖ హాస్య నటుడు వివేక్‌కి సంబంధించిన సన్నివేశాలను రీ షూట్‌ చేయనున్నారట. వివేక్‌పై కొన్ని సన్నివేశాలు తీయాల్సి ఉండగానే...ఆయన మరణించడంతో ఆయన స్థానంలో త్వరలోనే మరో నటుడిని ఎంపిక చేయనున్నారట శంకర్‌. త్వరలోనే ఆ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ‘ఇండియన్‌ 2’ని పూర్తిచేశాకే శంకర్‌ తన ఇతర చిత్రాలను మొదలుపెట్టాలంటూ ‘ఇండియన్‌ 2’ నిర్మాతలు కోర్టుని ఆశ్రయించారు. దర్శక నిర్మాతలు సామరస్య పూర్వకంగా సమస్యని  పరిష్కరించుకోవాలని కోర్టు సూచించినట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని