‘దృశ్యం2’: ఆ సీన్‌ చూసి పగలబడి నవ్విన అశ్విన్‌

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం2’. ఇటీవల అమెజాన్‌

Updated : 23 Feb 2021 16:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం2’. ఇటీవల అమెజాన్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా జార్జ్‌కుట్టిగా మోహనలాల్‌ మరోసారి మెస్మరైజ్‌ చేశారు. అటు అభిమానులతో పాటు, ఇటు సినీ విమర్శకుల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు లభిస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రాన్ని టీమ్‌ ఇండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చూశాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ అశ్విన్‌ ట్వీట్ చేశాడు. ‘కోర్టు సన్నివేశంలో జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్‌) సృష్టించిన ట్విస్ట్‌ చూసి గట్టిగా నవ్వేశా. మీరు అలా చేయలేకపోయారా? అయితే, మళ్లీ ‘దృశ్యం1’ నుంచి చూడండి. అద్భుతం.. నిజంగా అద్భుతం’’ అని ట్వీట్‌ చేశాడు. అశ్విన్‌ చేసిన ట్వీట్‌కు మోహన్‌లాల్‌ స్పందించారు.

‘‘ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ సమయం తీసుకుని, ‘దృశ్యం2’ చూడటమే కాదు, దాని గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీ స్పందన మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మీ కెరీర్‌ అద్భుతంగా ఉండాలి అశ్విన్‌’’అని సమాధానం ఇచ్చారు.

‘దృశ్యం’కు కొనసాగింపుగా జీతూ జోసెఫ్‌ ‘దృశ్యం2’ను తెరకెక్కించారు. వరుణ్‌ మిస్సింగ్‌ ముగిసిన ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆ కేసును పోలీసులు రీ ఓపెన్‌ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్‌ కుట్టి ఏం చేశాడు? ఎలాంటి ఎత్తులు వేశాడు? అన్నది చిత్ర కథ!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని