ఓటీటీలో వర్మ ‘డి - కంపెని’

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఓ చిత్రం తెరకెక్కించారు. అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘డి - కంపెనీ’ పేరుతో రూపొందిన ఈ సినిమాని...

Published : 05 May 2021 10:27 IST

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఓ చిత్రం తెరకెక్కించారు. అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘డి - కంపెనీ’ పేరుతో రూపొందిన ఈ సినిమాని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వర్మ ప్రకటించారు. ఈనెల 15న స్పార్క్‌ ఓటీటీలో ఈ చిత్రం ప్రసారం కానుందని మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘‘ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడన్నది ఇందులో చూపించనున్నారు దర్శకుడు. అలాగే అతను స్థాపించిన డి-కంపెనీ నీడలో బతికిన ఇతర గ్యాంగ్‌స్టర్ల జీవితాల్ని ఈ చిత్రంలో స్పృశించారు’’ అని చిత్ర బృందం తెలియజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని