Daksha: యువ తారల వినూత్న ప్రయత్నమే ‘దక్ష’

రోనా విపత్కర పరిస్థితులు ఎన్ని ఎదురైనా తమ వినూత్న ప్రయత్నాన్ని ఆపలేవని యువ దర్శకుడు వివేకానంద విక్రాంత్‌ తెలిపారు.

Published : 08 Jan 2022 15:15 IST

హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితులు ఎన్ని ఎదురైనా తమ వినూత్న ప్రయత్నాన్ని ఆపలేవని యువ దర్శకుడు వివేకానంద విక్రాంత్‌ తెలిపారు. ఆయన దర్శకత్వంలో సీనియర్‌ నటుడు శరత్‌బాబు తనయుడు ఆయుష్ కథానాయకుడిగా నటిస్తున్న సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దక్ష’. నక్షత్ర, అను కీలక పాత్రలు పోషించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా బృందం పాల్గొని సందడి చేసింది.

అరకులోని పలు అందమైన లొకేషన్‌లతో పాటు నగరంలోనూ షూటింగ్‌ చేశామని నిర్మాత తల్లాడ సాయి కృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు తెలుగులో చూడని వినూత్నమైన సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘దక్ష’ రూపొందించామని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వలన ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే లక్ష్యంతో తమ యువ బృందం నిరంతరం శ్రమిస్తుందని హీరో ఆయుష్‌ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ‘దక్ష’ రూపంలో మంచి సక్సెస్‌ అందుకోబోతున్నామని సినీతారలు నక్షత్ర, అను తమ హర్షం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని