Deepika Padukone: తండ్రి జీవితాన్ని వెండితెరపై చూపించనున్న టాప్ హీరోయిన్!
ఇన్నాళ్లు తండ్రి నిర్మాణసంస్థల్లో పనిచేస్తూ వచ్చిన నటులనే చూశాం. అందుకు భిన్నంగా రూట్ మార్చారు బాలీవుడ్ భామ దీపికా పదుకొణె...
ఇంటర్నెట్ డెస్క్: ఇన్నాళ్లు తండ్రి నిర్మాణసంస్థల్లో పనిచేస్తూ వచ్చిన నటులనే చూశాం. అందుకు భిన్నంగా రూట్ మార్చారు బాలీవుడ్ భామ దీపికా పదుకొణె. ఇటీవల ‘గెహ్రాహియా’తో హిట్ అందుకున్న దీపికా... త్వరలోనే తన తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణె బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాలను పంచుకున్నారు.
‘‘1983 ఏడాది అంటే క్రీడాభిమానులకు చాలా స్పెషల్. భారత క్రికెట్ జట్టు తొలిసారి వరల్డ్కప్ గెలుచుకొని ప్రపంచ చూపు మనవైపు తిప్పుకొనేలా చేసింది. నిజానికి దీని కన్నా ముందు ప్రపంచంలో భారత క్రీడల గురించి మాట్లాడుకునేలా చేసిన ఇండియన్ క్రీడాకారుల్లో ఒకరు నాన్న ప్రకాశ్ పదుకొణె. 1981లో ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. అలా 83 కన్నా ముందే ప్రపంచంలోనే బ్మాడ్మింటన్ క్రీడను తన ఆటతో ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇదంతా నాన్నకు అంత తేలికగా సాధ్యపడలేదు. ఇప్పుడున్నంత అధునాతన వసతులు, సౌకర్యాలు అప్పటి క్రీడాకారులకు లేవు. మ్యారేజీ హాల్లో శిక్షణ తీసుకున్నారు. అప్పట్లో బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులో లేవు. దీంతో మ్యారేజీ హాళ్లను ఆయన బ్యాడ్మింటన్ కోర్టులుగా మార్చారు. అనుకూలంగా లేనీ అంశాన్ని.. ఆయన తనకు అనుకూలంగా మార్చుకుని ఒక్కోమెట్టూ ఎదిగారు. ఇప్పుడున్న సదుపాయాలే కనుక ఆనాడే ఉన్నట్లైతే.. మరింత రాణించేవారు’’ అంటూ తన తండ్రి గురించి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం చిత్ర సీమలో క్రీడా నేపథ్య చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. గతేడాది భారత జట్టు ప్రపంచకప్ సాధించిన నేపథ్యంలో వచ్చిన ‘83’ మంచిటాక్ సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారామె. ఇక ఈ మార్చి4న ఫుట్బాల్ ఆటగాడు విజయ్ బార్సే బయోపిక్ థియేటర్లో విడుదల కానుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ విజయ్గా కనిపించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM