మళ్లీ పోస్టు పెట్టిన దీపిక

బాలీవుడ్‌ నటి దీపికాపదుకొణె కొత్త సంవత్సర ప్రారంభంలోనే సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టులన్నీ తొలగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే.. అందుకు గల కారణాలేంటో చెప్పకుండానే ఆమె ఓ పోస్టు చేసింది. ‘మై ఆడియో డైరీ’ పేరుతో ఓ

Published : 02 Jan 2021 17:33 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె కొత్త సంవత్సర ప్రారంభంలోనే సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టులన్నీ తొలగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే.. అందుకు గల కారణాలేంటో చెప్పకుండానే ఆమె ఓ పోస్టు చేసింది. ‘మై ఆడియో డైరీ’ పేరుతో ఓ ఆడియో క్లిప్‌ను ఆమె అభిమానులతో పంచుకుంది. ఆ పోస్టుకు ‘మీరు ఏ విషయంలో కృతజ్ఞతగా ఉన్నారు..?’ అంటూ కాప్షన్‌ పెట్టింది. ‘‘అందరికీ హాయ్. ‘నా ఆలోచనలు.. భావాలు’ వ్యక్తపరిచే ఆడియో రికార్డు ‘మై ఆడియో డైరీ’కి స్వాగతం. 2020 ప్రతి ఒక్కరికీ అనిశ్చితిని కలిగించిన సంవత్సరం. ఈ విషయంలో మీరంతా నాతో అంగీకరిస్తారని నమ్ముతున్నా. 2021లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందులో నేనూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని ఆడియోలో దీపిక పేర్కొంది.

ఇక నూతన సంవత్సర వేడుకల కోసం దీపిక తన భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి జైపూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దీపిక మాజీ ప్రియుడు రణ్‌బీర్‌కపూర్ తన ప్రేయసి అలియాభట్‌తో కలిసి అదే హోటల్‌లో దిగారు. ఈ సందర్భంగా రణ్‌వీర్‌సింగ్, రణ్‌బీర్‌కపూర్ కలిసి పార్టీ చేసుకున్న ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి.

సొట్టబుగ్గల సుందరి దీపిక తన భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి ‘83’ చిత్రంలో నటిస్తోంది. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో స్పోర్ట్స్‌ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది. దీంతోపాటు షకున్ బాత్రా డైరెక్టర్‌గా వస్తున్న సినిమాలోనూ దీపిక కనిపించనుంది. ఆ సినిమా షూటింగ్‌ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు సమాచారం. డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ‘పఠాన్‌’ సినిమాలో షారుఖ్‌ సరసన దీపిక నటించనుంది.

ఇదీ చదవండి..

పోస్టుల డిలీట్.. దీపికాకు ఏమైంది?

‘లూసిఫర్‌’ రీమేక్‌లో సత్యదేవ్‌..?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని