Deepika Padukone: ఏదో ఒక రోజు భారత్‌లోనే కేన్స్‌ వేడుక

కేన్స్‌లో భారత్‌ సభ్య దేశంగా పాల్గొనడం కాకుండా.. భవిష్యత్తులో ఏదో ఒక రోజు భారతదేశంలోనే కేన్స్‌ చిత్రోత్సవం జరుగుతుందని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె ధీమా వ్యక్తం చేసింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ వేడుకలకు

Updated : 19 May 2022 06:47 IST

కేన్స్‌లో భారత్‌ సభ్య దేశంగా పాల్గొనడం కాకుండా.. భవిష్యత్తులో ఏదో ఒక రోజు భారతదేశంలోనే కేన్స్‌ చిత్రోత్సవం జరుగుతుందని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె ధీమా వ్యక్తం చేసింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ వేడుకలకు భారత సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ నేతృత్వంలో చిత్ర పరిశ్రమ బృందం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో వీరంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా దీపిక మాట్లాడుతూ ‘15 ఏళ్ల క్రితం నేను సినిమాల్లోకి వచ్చినపుడు నా ప్రతిభను గుర్తిస్తారన్న నమ్మకం లేదు. ఇపుడు కేన్స్‌ జ్యూరీలో న్యాయ నిర్ణేతగా మీ ముందు ఉన్నందుకు గర్వంగా ఉంద’ని తెలిపింది. అక్కడే ఉన్న ఏఆర్‌ రెహమాన్‌, శేఖర్‌ కపూర్‌లపై ప్రశంశల జల్లు కురిపించింది. వారిద్దరూ తమ ప్రతిభతో భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించారని వ్యాఖ్యానించింది. అందువల్లే తమ లాంటి వారికి ఇలాంటి వేడుకల్లో గౌరవం లభిస్తోందని ధన్యవాదాలు తెలిపింది. ఆర్‌ మాధవన్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతెలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని