దేవతలు ఉలికిపడేలా.. దేవుడు మైమరచేలా

దేవతలంతా ఉలికిపడేలా దేవుడు కూడా మైమరచేలా ఏమున్నావే పిల్లా’ అంటున్నారు అల్లరి నరేశ్‌. ఈయన కథానాయకుడుగా విజయ్‌ కనక మేడల తెరకెక్కించిన చిత్రం ‘నాంది’. ఈ సినిమాలోని ‘దేవతలంతా’ అనే పాటను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ గీతానికి శ్రీచరణ్‌  పాకాల స్వరాలు సమకూర్చారు.

Published : 17 Feb 2021 21:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దేవతలంతా ఉలికిపడేలా దేవుడు కూడా మైమరచేలా ఏమున్నావే పిల్లా’ అంటున్నారు అల్లరి నరేశ్‌. ఈయన కథానాయకుడుగా విజయ్‌ కనక మేడల తెరకెక్కించిన చిత్రం ‘నాంది’. ఈ సినిమాలోని ‘దేవతలంతా’ అనే పాటను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ గీతానికి శ్రీచరణ్‌  పాకాల స్వరాలు సమకూర్చారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ చక్కని గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. 

 ఎస్‌.వి.2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సతీశ్‌ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ప్రియదర్శి, శ్రీకాంత్‌ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ సినిమా. కథానాయకుడిగా నరేశ్‌కి ఇది 57వ సినిమా. ఇప్పటి వరకు నటించిన వైవిధ్య పాత్ర పోషించారు నరేశ్‌. ఖైదీగా ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌లో ఆయన కనిపించిన తీరు సినిమాపై అంచనాలు పెంచుతోంది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని