Dhanush: శేఖర్‌.. నాకెంతో ఇష్టమైన దర్శకుడు

టాలీవుడ్‌ క్లాసిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల అంటే తనకెంతో అభిమానమని కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌ తెలిపారు. త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సరికొత్త చిత్రం రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కొత్త ప్రాజెక్ట్‌ గురించి స్పందిస్తూ శనివారం ధనుష్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

Published : 20 Jun 2021 01:34 IST

కొత్త ప్రాజెక్ట్‌పై హీరో ట్వీట్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ క్లాసిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల అంటే తనకెంతో అభిమానమని కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌ తెలిపారు. త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సరికొత్త చిత్రం రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కొత్త ప్రాజెక్ట్‌ గురించి స్పందిస్తూ శనివారం ధనుష్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

‘నాకెంతో ఇష్టమైన దర్శకుల్లో శేఖర్‌కమ్ముల ఒకరు. ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందాను. ఆయనతో కలిసి పని చేయడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. మూడు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌, నారాయణ్‌దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రాజెక్ట్‌ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను’ అని ధనుష్‌ ట్వీట్‌ చేశారు.

ధనుష్‌ కథానాయకుడిగా నటించిన ‘జగమే తంత్రం’ శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యింది. ఇందులో ధనుష్‌ మాస్‌ గ్యాంగ్‌స్టర్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘అత్రాంగి రే’, ‘ది గ్రే మ్యాన్‌’ ప్రాజెక్టులున్నాయి. సెకండ్‌వేవ్‌ కారణంగా వాయిదా పడిన ఆ సినిమా షూటింగ్స్‌ తిరిగి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. మరోవైపు, శేఖర్‌కమ్ముల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘లవ్‌స్టోరీ’ చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘లవ్‌స్టోరీ’ విడుదల తర్వాత శేఖర్‌కమ్ముల-ధనుష్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు