‘ప్రియ.. నా గుండె లయ’ అంటున్న ఆది..!

ప్రదీప్‌ వ్యాఖ్యాతగా.. శేఖర్‌ మాస్టర్‌, పూర్ణ, ప్రియమణి.. న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న షో ‘ఢీ’. తాజాగా ఈ షో పన్నెండో సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని, పదమూడవ సీజన్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో కింగ్స్‌ వర్సస్‌ క్వీన్స్‌గా సుధీర్‌, ఆది, రష్మి, దీపిక వ్యవహరించారు. ఈ సీజన్‌కు సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది.

Updated : 18 Aug 2022 11:02 IST

హైదరాబాద్: ప్రదీప్‌ వ్యాఖ్యాతగా.. శేఖర్‌ మాస్టర్‌, పూర్ణ, ప్రియమణి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న షో ‘ఢీ’. తాజాగా ఈ కార్యక్రమం పన్నెండో సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని, పదమూడవ సీజన్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో కింగ్స్‌ వర్సస్‌ క్వీన్స్‌గా సుధీర్‌, ఆది, రష్మి, దీపిక వ్యవహరించారు. ఈ సీజన్‌కు సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది.

త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ లో ‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు’ అంటూ ఓ కంటెస్టెంట్‌ చేసిన ప్రదర్శనకు పూర్ణ ఫిదా అయ్యారు. అదే విధంగా ‘అందమైన ప్రేమరాణి.. చేయి తగిలితే’ అంటూ ఓ కంటెస్టెంట్‌ చేసిన డ్యాన్స్‌కి సూపర్‌గా ఉందని జడ్జిలందరూ కామెంట్లు ఇచ్చారు. అంతేకాకుండా ఎప్పటిలాగానే ఆది-ప్రదీప్‌ వరుస పంచులతో కడుపుబ్బా నవ్వించారు. అలాగే ఆది.. ప్రియమణి గురించి ఓ ప్రేమ కవిత్వంతో ఎంతగానో అలరించారు. ఈ అదిరే స్టెప్పులు, అల్లరి హంగామాను వీక్షించాలంటే వచ్చే బుధవారం (డిసెంబర్‌ 23)న ప్రసారం కానున్న ‘ఢీ 13’ ఎపిసోడ్‌ను చూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమోను తిలకించండి. 


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని