రష్మి.. ఈ రౌండ్ గెలిచేది ‘కింగ్స్‌’: సుధీర్

ప్రదీప్‌ వ్యాఖ్యాతగా.. శేఖర్‌ మాస్టర్, పూర్ణ, ప్రియమణి న్యాయనిర్ణేతలుగా.. కింగ్స్‌గా సుధీర్‌, ఆది.. క్వీన్స్‌గా రష్మి, దీపిక వ్యవహరిస్తున్న షో ‘ఢీ 13’. అదిరిపోయే స్టెప్పులతో ఈ షో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 

Updated : 18 Aug 2022 10:59 IST

హైదరాబాద్: ప్రదీప్‌ వ్యాఖ్యాతగా.. శేఖర్‌ మాస్టర్, పూర్ణ, ప్రియమణి న్యాయనిర్ణేతలుగా.. కింగ్స్‌గా సుధీర్‌, ఆది.. క్వీన్స్‌గా రష్మి, దీపిక వ్యవహరిస్తున్న షో ‘ఢీ 13’. అదిరిపోయే స్టెప్పులతో ఈ షో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

షోలో భాగంగా ‘రష్మి.. గెలిచేది కింగ్స్‌‌’ అంటూ సుధీర్‌ సరదాగా నవ్వులు పూయించారు. అంతేకాకుండా ‘ముసుగు వేయొద్దు మనసు మీద’ అంటూ ఓ కంటెస్టెంట్ చేసిన ప్రదర్శనకి శేఖర్ మాస్టర్‌ ఫిదా అయ్యారు. అదే విధంగా మరో కంటెస్టెంట్ చేసిన మ్యూజిక్‌ థీమ్‌కు సూపర్‌ అంటూ జడ్జిలందరూ కామెంట్లు ఇచ్చారు. ఆది, సుధీర్‌, ప్రదీప్‌ వరుస పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించారు. ఈ ఉర్రూతలూగించే డ్యాన్సులు, నవ్వుల హంగామాను వీక్షించాలంటే వచ్చే బుధవారం (డిసెంబర్ 6)న ప్రసారం కానున్న ‘ఢీ 13 కింగ్స్ VS క్వీన్స్’ చూడాల్సిందే.. అప్పటి వరకు ఈ ప్రోమోను తిలకించండి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని