Dhee 13: సుధీర్‌-రష్మి మధ్య మాటల్లేవా?

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరించే జోడీ సుధీర్‌-రష్మి. వారిద్దరూ కాసేపు తెరపై కనపడినా చాలు సందడే సందడి.

Updated : 15 Aug 2022 16:53 IST

హైదరాబాద్‌: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరించే జోడీ సుధీర్‌-రష్మి. వారిద్దరూ కాసేపు తెరపై కనపడినా చాలు సందడే సందడి. అలాంటిది వారు మాట్లాడుకోవటం లేదా? ఇంతకీ వారి మధ్య ఏం జరిగింది? ఇదే ప్రశ్నను హైపర్‌ ఆది అడిగితే ‘మాట్లాడుకోవటానికి ఏం కారణం లేదు’ అని రష్మి సమాధానం ఇచ్చింది. అప్పుడే వీరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు యాంకర్‌ ప్రదీప్‌. అందుకు ‘ఢీ’ ప్రోగ్రాం వేదికైంది.

భాషతో సంబంధం లేకుండా డ్యాన్స్‌ ప్రియులను అలరిస్తున్న షో ‘ఢీ’. ప్రస్తుతం 13వ సీజన్‌లో భాగంగా ‘కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ మధ్య క్వార్టర్‌ ఫైనల్స్‌ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రష్మి చేసిన డ్యాన్స్‌ విశేషంగా అలరించింది. ఇక రష్మి-సుధీర్‌ మాట్లాడుకుంటూ ‘కారు కొన్నావు పార్టీ ఇవ్వలేదే’ అని సుధీర్‌ అడగ్గా, ‘ఇల్లు కొన్నావు.. నువ్వు ఇచ్చావా’ అని ఎదురు ప్రశ్నించింది. ‘ఇంకా గృహ ప్రవేశం అవ్వలేదు. అయిన తర్వాత ఇస్తా’ అని సుధీర్‌ సమాధానం ఇస్తుంటే, ‘చాలా ప్రవేశాలు అయ్యాయి’ అంటూ ఆది పంచ్‌ డైలాగ్‌ విసరడం నవ్వులు పూయిస్తోంది. ఇక ‘కాంచన’ పాటకు కావ్య చేసిన డ్యాన్స్‌ ఒళ్లు గగురు పొడిచేలా ఉంది. మరి ఈ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఎవరు గెలిచారు? ఎవరి డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ విశేషంగా అలరించింది? తెలియాలంటే నవంబరు 3వ తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే! అప్పటివరకూ అలరించే ఈ ప్రోమో చూసేయండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని