Dhruv: విక్రమ్‌ డైలాగ్‌తో అదరగొట్టేసిన ధ్రువ్‌.. వీడియో వైరల్‌

‘పొన్నియిన్‌ సెల్వన్‌’తో సూపర్‌హిట్‌ అందుకున్నారు నటుడు విక్రమ్‌. ఈ సినిమాలో ఆయన చెప్పిన సంభాషణలను తాజాగా ధ్రువ్‌ ఓ ఈవెంట్‌లో రీ క్రియేట్‌ చేశారు.

Published : 17 Oct 2022 15:16 IST

చెన్నై: విలక్షణ నటుడు విక్రమ్‌ (Vikram) కుమారుడిగా వెండితెరకు పరిచయమయ్యారు నటుడు ధ్రువ్ (Dhruv)‌. ఇటీవల ‘మహాన్‌’ కోసం తన తండ్రితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ధ్రువ్‌.. తాజాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ డైలాగ్‌తో అదరగొట్టేశారు. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ధ్రువ్‌.. ప్రేక్షకుల కోరిక మేరకు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan)లో విక్రమ్‌ చెప్పిన ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని చెప్పారు. దీంతో సభాప్రాంగణం మొత్తం ఈలలు, చప్పట్లతో మార్మొగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్‌ డైలాగ్‌ని ధ్రువ్‌ చెబుతుంటే చూడచక్కగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ విషయానికి వస్తే.. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్‌.. ఆదిత్య కరికాలన్‌ పాత్రలో నటించారు. చారిత్రాత్మక కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్‌, త్రిష, కార్తి, జయం రవి తదితరులు కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని