Ananya Panday: అనన్యను పట్టించుకోని ఆర్యన్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ తాజాగా ‘మజా మా’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్కు హాజరయ్యారు. ఆయన స్క్రీనింగ్కు హాజరైన సమయంలో అనన్య పాండే అక్కడే ఉన్నారు. అయితే ఆయన అనన్యను ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
ముంబయి: పబ్లిక్లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్. తాజాగా ఆయన ఓ బాలీవుడ్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్కు హాజరయ్యారు. బీటౌన్ నటీనటులతో కలిసి సినిమాని ఎంజాయ్ చేశారు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న నటి అనన్యపాండేను ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
నటి మాధురీదీక్షిత్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘మజా మా’. అమెజాన్ ప్రైమ్ వేదికగా అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం బీటౌన్ సెలబ్రిటీల కోసం ముంబయిలోని ఓ మాల్లో ‘మజా మా’ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ కార్యక్రమానికి నటి అనన్య పాండే, ఆర్యన్ఖాన్, కరణ్ జోహార్, మనీశ్ మల్హోత్ర హాజరయ్యారు. స్క్రీనింగ్కు వెళ్లే ముందు థియేటర్ బయట అనన్యను చూసిన ఆర్యన్.. ఆమెను ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు.. ‘‘అయ్యో పాపం అనన్య ఫీలై ఉంటుంది’’ అంటూ సరదా కామెంట్స్ పెడుతున్నారు.
మరోవైపు, షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్కు అనన్య మంచి స్నేహితురాలు. షారుఖ్ నివాసంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అనన్య హాజరవుతుంటారు. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలోనూ అనన్య ఈ విషయాన్ని బయటపెట్టారు. అలాగే, తనకు ఆర్యన్ అంటే ఇష్టమనీ చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన వీడియో చూసి పలువురు నెటిజన్లు.. ఆర్యన్ కావాలనే ఆమెను పట్టించుకోకుండా వెళ్లిపోయారనుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?