మీరు ప్రశ్నిస్తే.. నేను సమాధానం చెప్పాలా? దిల్జిత్‌

బాలీవుడ్ నటులు కంగనా రనౌత్‌, దిల్జిత్‌ దొసాంజ్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ టెలివిజన్‌ ఇంటర్వ్యూలో కంగన  ‘దిల్జిత్‌., తాను ఖలిస్తానీ ఉద్యమకారుడిని కానని చెప్పమనండి’అంటూ అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై

Published : 09 Feb 2021 01:48 IST

ముంబయి: బాలీవుడ్ నటులు కంగనా రనౌత్‌, దిల్జిత్‌ దొసాంజ్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ టెలివిజన్‌ ఇంటర్వ్యూలో కంగన  ‘దిల్జిత్‌., తాను ఖలిస్తానీ ఉద్యమకారుడిని కానని చెప్పమనండి’అంటూ అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై దిల్జిత్‌ తనదైన శైలిలో సోమవారం ట్విటర్‌ ద్వారా స్పందించారు. పంజాబీలో ట్వీట్‌ చేస్తూ ‘ వాళ్లు టీవీ షోల్లో కూర్చుని దేశభక్తులం అనుకుంటున్నారు. దేశం అంతా తమ కోసమే ఉన్నట్టు భావిస్తున్నారు. ఇప్పటివరకు పంజాబీలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆ దేవుడు మళ్లీ అదే త్యాగమే కోరుకుంటే మేము సిద్ధం. ’ అంటూ కంగనా పేరు ప్రస్తావించకుండా ప్రశ్నించాడు

మరో ట్వీట్‌లో ‘ మీరు ప్రశ్నలడగాలి, నేను సమాధానం ఇవ్వాలి. ఏంటి ఈ డ్రామా అంతా? వాళ్లు దేశం గురించి, పంజాబ్‌ గురించి మాట్లాడుతున్నారు. ఆ క్రమంలోనే చర్చను మరో కోణంలోకి నెట్టేస్తున్నారు. మీరు మమ్మల్ని ఎలా కావాలంటే అలా చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా బాగుంది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. వీరిద్దరి మధ్య రైతుల ఉద్యమం మొదలైనప్పటించి ట్వీట్‌వార్‌ జరుగుతూనే ఉన్నసంగతి తెలిసిందే. ఈ ఉద్యమానికి దిల్జిత్‌ సానుభూతి తెలిపి, రైతులకు సహాయం కూడా చేశాడు. ఈ ఉద్యమాన్ని రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నారని కంగనా ఆరోపిస్తోంది.

ఇవీ చదవండి!

పవన్‌-రానాతో వినాయక్‌..!

ప్రకృతి కోపానికి నిదర్శనమిది



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని