రెండోసారి.. పంథా మారి
చిత్ర సీమలో, ప్రేక్షకుల్లో కాంబినేషన్లపై ఎప్పుడూ విపరీతమైన ఆసక్తి ఏర్పడుతుంది. దర్శకుడు, కథానాయకుడు కాంబోకు
చిత్ర సీమలో, ప్రేక్షకుల్లో కాంబినేషన్లపై ఎప్పుడూ విపరీతమైన ఆసక్తి ఏర్పడుతుంది. దర్శకుడు, కథానాయకుడు కాంబోకు అది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఓ దర్శకుడు-నటుడు కలిసి చేసిన తొలి చిత్రం హిట్ అందుకుంటే చాలు ఆ కలయికలో వచ్చే రెండో సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు అభిమానులు. ఆ జాబితాలో ఏ చిత్రాలున్నాయి? దర్శక-నటులెవరు? చూసేద్దాం...!
శివ-నాని
దర్శకుడు శివ నిర్వాణ, కథానాయకుడు నాని తమ కెరీర్లో ఎక్కువగా ప్రేమ కథల్నే ప్రేక్షకులకు చూపించారు. గతంలో ‘నిన్నుకోరి’తో అలరించిన ఈ జోడీ ఈసారి యాక్షన్ ప్యాక్తో రాబోతున్నారు. శివ-నాని కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న రెండో సినిమా ‘టక్ జగదీష్’. కుటుంబ కథా నేపథ్యంలో అన్నదమ్ముల అనుబంధం ఆవిష్కరించనున్నారు. ఎమోషన్కి ఎంత ప్రాధాన్యం ఉందో యాక్షన్ సన్నివేశాలకు అంతే ప్రాముఖ్యత ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ని చూస్తుంటే నాని లుక్ సైతం పవర్ఫుల్గా ఉంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. షైన్ స్ర్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. నాని-శివ కలయికలో వచ్చిన తొలి చిత్రం విజయం అందుకోవడంతో ‘టక్ జగదీష్’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకీ- శ్రీకాంత్
వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కలిసి పనిచేసిన తొలి సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. క్రేజీ మల్టీస్టారర్గా కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ కాంబోలో వస్తోన్న ద్వితీయ చిత్రం ‘నారప్ప’. ప్రియమణి నాయిక. తమిళంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘అసురన్’కు రీమేక్గా తెరకెక్కుతోంది. కుటుంబ కథలకు కేరాఫ్గా నిలిచే శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ని తెలుగులో తెరకెక్కించడం అటు పరిశ్రమ వర్గాల్ని, ఇటు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సమాధానంగా గ్లింప్స్ విడుదల చేసి తానేంటో నిరూపించుకున్నారు శ్రీకాంత్. పోస్టర్లు సైతం ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేశ్ బాబు నిర్మిస్తున్నారు. తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను సమర్పిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది.
రవితేజ- రమేశ్
‘వీర’తో తొలిసారి కలిశారు రవితేజ- రమేశ్ వర్మ. యాక్షన్ కామెడీ నేపథ్యంలో వచ్చి ఆ చిత్రం పర్వాలేదనిపించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘ఖిలాడి’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్లే స్మార్ట్ అనేది ఉప శీర్షిక. గత చిత్రంలానే ఇందులోనూ యాక్షన్తోపాటు కామెడీ ఉండబోతుంది. రవితేజ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ కథానాయికలు. ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. రవితేజ ఫస్ట్లుక్ సినీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. మే 28న రాబోతున్నాడీ ఖిలాడి.
పవన్- హరీశ్
పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ ఈ కాంబినేషన్కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘గబ్బర్ సింగ్’తో బాక్సాఫీస్ను షేక్ చేసింది ఈ జోడీ. అంతటి సూపర్హిట్ తర్వాత ఈ ఇద్దరు కలిసి మరో చిత్రానికి పనిచేస్తున్నారు. ప్రకటన వెలువడటమే ఆలస్యం అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. కథేంటి? నాయిక ఎవరు? అంటూ ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఆ ఆసక్తిని అలాగే కొనసాగిస్తూ ‘పీఎస్పీకే 28’ వర్కింగ్ టైటిల్తో కథని పక్కాగా సిద్ధం చేస్తున్నారు హరీశ్. ‘గబ్బర్సింగ్’లా వినోదాన్ని పంచుతూనే సందేశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పట్టాలెక్కనుందీ ఈ క్రేజీ ప్రాజెక్టు.
తారక్- త్రివిక్రమ్
‘అరవింద సమేత’తో క్రేజీ కాంబినేషన్ జాబితాలో చేరారు ఎన్టీఆర్, త్రివిక్రమ్. ఈ సినిమాలో త్రివిక్రమ్ తనదైన శైలిలో మాటలు వినిపిస్తూనే అదిరిపోయే యాక్షన్ చూపించి వావ్ అనిపించారు. మరోసారి ఈ ఇద్దరి నుంచి సినిమా వస్తుందనడంతో తారక్ అభిమానులు పండగ చేసుకున్నారు. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తొలి సినిమా ఘన విజయం అందుకోవడంతో ఈ కాంబోలో వస్తోన్న రెండో చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే అప్పుడు యాక్షన్ నేపథ్యంలో వచ్చారు ఈసారి రాజకీయ కోణంలో రాబోతున్నారని సినీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. -
సూర్య సినిమా ఆగిపోలేదు.. వెట్రిమారన్ ఏమన్నారంటే..
నటుడు సూర్య, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. -
అప్డేట్స్ ఇచ్చిన అగ్ర హీరోలు.. రిలీజ్ డేట్తో విజయ్.. టైటిల్స్తో సల్మాన్, గోపీచంద్
అగ్ర హీరోలు పలువురు తమ కొత్త సినిమాల అప్డేట్స్ను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిలిపివేత.. పీవీఆర్ మల్టీప్లెక్స్పై ‘మైత్రీ మూవీస్’ ఆగ్రహం
పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే? -
‘గౌడ్ సాబ్’ కథ విని ఆశ్చర్యపోయా: సుకుమార్
కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఇందులో ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్నారు. -
పండగ వేళ కొత్త పోస్టర్ల కళకళ.. మరో మూవీ ప్రకటించిన మాస్ హీరో
ఉగాది సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
‘దేవర’ ఆలస్యమైనా ప్రతి అభిమాని కాలరెగరేసుకునేలా ఉంటుంది: ఎన్టీఆర్
‘దేవర’ (Devara) ఆలస్యమైనా అభిమానులందరూ కాలరెగరేసుకునేలా మూవీని అందించడానికి ప్రయత్నిస్తున్నామని అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ (NTR) అన్నారు. -
‘డియర్’.. ‘గుడ్నైట్’ ఫిమేల్ వెర్షన్ కాదు: ఐశ్వర్యరాజేశ్
ఐశ్వర్య రాజేశ్, జీవీ ప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. -
ప్రభాస్తో హను రాఘవపూడి సినిమా లాక్.. ఏ జానరంటే!
తన తర్వాత సినిమా ప్రభాస్తో తీయనున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) స్పష్టం చేశారు. -
ప్రభాస్.. ఆ సినిమా రీమేక్ చేద్దామంటే వద్దని చెప్పా: సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘స్పిరిట్’ (Spirit). -
పుష్పగాడి రూల్ మొదలైంది.. ‘పుష్ప 2’ టీజర్ వచ్చేసింది..!
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’. సుకుమార్ దర్శకుడు. -
ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో క్రేజీ మూవీస్
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదాల జోరు కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి. -
ఇది కదా.. ‘పుష్ప’ రేంజ్.. రూల్ చేయడానికి వచ్చేస్తున్నాడు!
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేసే టైమ్ను తెలియజేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్ను పంచుకుంది. -
‘భారతీయుడు 2’ వచ్చేది అప్పుడే.. అధికారికంగా ప్రకటించిన టీమ్
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు2’ విడుదలపై చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
బాక్సాఫీస్ వద్ద రూ.కోట్లు కొల్లగొడుతోన్న ‘ఆడు జీవితం’.. వసూళ్లు ఎంతంటే..?
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
హీరో అంటే హీరో పనే చేయాలి.. సినిమాను సినిమాటిక్గానే తీయాలి: దిల్ రాజు
Family Star: ఫ్యామిలీస్టార్ కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోందని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. -
‘రామాయణ’ కోసం ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్స్!
బాలీవుడ్లో తెరకెక్కనున్న ‘రామాయణ’పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు
-
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
-
అరుదైన ఘటన..బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యం
-
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాల రద్దు
-
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్