కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా.. అందుకే 35 సినిమాలే చేశా: బి గోపాల్
స్క్రిప్ట్ బాగుంటే సినిమా హిట్ అవుతుందని లేకపోతే ఫ్లాప్ తప్పదని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ అన్నారు. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా
హైదరాబాద్: స్క్రిప్ట్ బాగుంటే సినిమా హిట్ అవుతుందని లేకపోతే ఫ్లాప్ తప్పదని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ అన్నారు. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. నయనతార కథానాయిక. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి దర్శకుడు బి.గోపాల్ పంచుకున్న విశేషాలు..
‘‘ఆరడుగుల బుల్లెట్’ ఓ కమర్షియల్ మూవీ. తండ్రీ-కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. మరి ఆ కుటుంబానికి కష్టాలు ఎలా వచ్చాయి? ఎవరి వల్ల వచ్చాయి? అనేది తెరపై చూడాలి. ఈ కాన్సెప్ట్తో గతంలో సినిమాలు వచ్చాయి. కానీ, ఇందులో భావోద్వేగాలకు పెద్ద పీట వేశాం. వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు బాగా కుదిరాయి’’
‘‘నరసింహనాయుడు’ విడుదలైన తరువాత పది నెలలు ఖాళీగా ఉన్నా. నేను చేసింది 35 సినిమాలే. మామూలుగా అయితే వందల సినిమాలు చేయొచ్చు. కానీ, నాకు కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. అందరికీ నచ్చేలా ఉంటేనే సినిమాను చేస్తాను. అశ్వనీదత్ గారు, చంటి అడ్డాల ఒకేసారి నా దగ్గరకు వచ్చారు. అలా ఇంద్ర, అల్లరి రాముడు చిత్రాలు మొదలయ్యాయి. స్క్రిప్ట్లు రెడీగా ఉంటే ఒకేసారి రెండు సినిమాలు కూడా చేశాను’’
‘‘ఇప్పటివరకూ నేను చేసినవి ఏవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు, కొత్త రచయితలను అందరినీ కథలు అడుగుతుంటాను. ‘మస్కా’తో కొత్త రచయితను పరిచయం చేశాను. చిన్ని కృష్ణను కూడా నేనే పరిచయం చేశా. నాకు కథ నచ్చితేనే సినిమాకు న్యాయం చేయగలుగుతాను’’
‘‘స్క్రిప్ట్ బాగుంటే.. సూపర్ హిట్ అవుతాయి. లేదంటే ఫ్లాప్ అవుతాయి. ‘క్రాక్’ జనాలకు నచ్చింది. కాబట్టే సూపర్ హిట్ అయింది. చివరకు జనాలకు నచ్చితేనే ఆడుతాయి. ఓటీటీ కంటెంట్లను కూడా జనాలు బాగానే చూస్తున్నారు. కానీ నాకు మాత్రం థియేటర్లోనే సినిమా చూడటం ఇష్టం. పెద్ద తెరపై సినిమా చూసేందుకే జనాలు ఇష్టపడతారు’’
‘‘ఫ్యాక్షన్ కథ చేస్తున్నామని సినిమా చేస్తున్నంత వరకూ నాకు తెలీదు. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’ సమయంలోనూ ఫ్యాక్షన్ సినిమా చేస్తానని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా కథ చెబితే.. ఫ్యాక్షన్ డ్రాప్లో డైరెక్షన్ చేసేందుకు రెడీ. బాలయ్య బాబుతో సినిమా చేయాలని చాలా ట్రై చేశాను. కానీ స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది’’
‘‘నాకు రీమేక్లు చేయడం ఎక్కువగా నచ్చదు. ‘అసెంబ్లీ రౌడీ’, ‘బ్రహ్మ’ చేశాను. కొత్త స్క్రిప్ట్తోనే సినిమాలు చేయడం ఇష్టం. కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులకు నచ్చేట్టుగా తీయాలని ప్రయత్నిస్తాను’’ అని బి.గోపాల్ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి