Director Madan: ప్రముఖ దర్శకుడు మదన్‌ కన్నుమూత

టాలీవుడ్‌ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు మదన్‌ కన్నుమూశారు.

Updated : 20 Nov 2022 09:23 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు మదన్‌ (Madan) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. మదన్‌ మరణ వార్తతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీతారలు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మదన్ అంత్య క్రియలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఫిల్మ్  నగర్ మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా తన ప్రతిభ నిరూపించుకొని.. ‘పెళ్లయిన కొత్తలో’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ‘గుండె ఝల్లుమంది’, ‘ప్రవరాఖ్యుడు’, ‘కాఫీ విత్ మై వైఫ్’, ‘గరం’, ‘గాయత్రి’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. మదన్‌ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని