ponniyin selvan: ‘పొన్నియిన్ సెల్వన్’కు ద్వారాలు తెరిచింది ‘బాహుబలి’
చోళుల గురించి ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలు తీయడానికి ‘బాహుబలి’ తమకు
హైదరాబాద్: చోళుల గురించి ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలు తీయడానికి ‘బాహుబలి’ తమకు బాటలు పరిచిందని, అందుకు స్టార్ డైరెక్టర్ రాజమౌళికి కృతజ్ఞతలు అన్నారు ప్రముఖ దర్శకులు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఎపిక్ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్-1’ తెరకెక్కనుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 30న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా, శుక్రవారం హైదరాబాద్లో ‘చోళ చోళ’ సాంగ్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఎందుకో తర్వాత చెబుతా. ఇక చోళ సామ్రాజ్యం గురించి చెప్పే ‘పొన్నియిన్ సెల్వన్’లాంటి భారీ చిత్రాన్ని అదీ రెండు భాగాలుగా తీయడానికి మాకు బాటలు పరిచిన రాజమౌళి గారికి కృతజ్ఞతలు. అందుకు కారణం ‘బాహుబలి’. మా సినిమాకు విక్రమ్, కార్తి, జయం రవి చాలా చక్కని నటీనటులు దొరికారు. అలాగే టెక్నికల్ టీమ్ కూడా అద్భుతంగా పనిచేసింది. ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.
శంకర్, మణిరత్నం చిత్రాల్లో నటిస్తే రిటైర్ అయిపోవచ్చు!
‘‘నాకు మణి సర్తో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పుడు ‘రావణ్’ ఇచ్చారు. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’. ఆయన సినిమాలో నేను ఉన్నాననంటే అది నా అదృష్టం. శంకర్, మణిరత్నం చిత్రాల్లో నటిస్తే హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. ఆ తర్వాత ఏ చిత్రాలు చేయకపోయినా ఫర్వాలేదు. అందరికీ ధన్యవాదాలు’’ అని విక్రమ్ చెప్పుకొచ్చారు. ‘‘పొన్నియిన్ సెల్వన్’ మణిరత్నం గారి కల. గొప్ప నటులు చేయాల్సిన పాత్రను ఆయన నాకు ఇచ్చారు. నాకు చాలా ప్రత్యేకం. కల్కి రాధాకృష్ణ రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల సినిమాగా తీయాలని ఎందరో ప్రయత్నించారు. కానీ, 60ఏళ్ల తర్వాత ఇది సాకారమైంది. ఇది సినిమా కాదు.. హిస్టరీ. ఈ నవలలో ప్రతి పాత్రకూ ప్రత్యేకత ఉంది. కథలో అద్భుమైన డ్రామా ఉంది. ఇదొక విజువల్ వండర్. ఇలాంటి వాటికి మణి సర్, రెహమాన్లాంటి గొప్పవారు కావాలి. ఇది ఆనాటి రాజకీయాల గురించి చెబుతుంది. ఇప్పుడూ అలాంటి రాజకీయాలే ఉన్నాయి. చాలా రీసెర్చ్ చేసి ఈ కథను సిద్ధం చేశారు. 140 రోజుల్లో పొన్నియిన్ రెండు భాగాలు తీయడం నిజంగా అద్భుతం’’ అని కార్తి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుహాసిని, ప్రకాశ్రాజ్, తనికెళ్ల భరణి, దిల్రాజు, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ