18 Pages: పాన్ ఇండియా హీరో అయినా కథను మార్చలేదు: సూర్య ప్రతాప్
దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తన కొత్త చిత్రం ‘18 పేజేస్’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు.
హైదరాబాద్: ‘కరెంట్’, ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలతో యువతను బాగా మెప్పించిన దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్. కొన్నాళ్ల విరామం అనంతరం ఆయన తెరకెక్కించిన చిత్రం ‘18 పేజెస్’ (18 Pages). నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama) జంటగా నటించిన చిత్రమిది. సుకుమార్ కథ అందించిన ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రతాప్ మీడియాతో ముచ్చటించారు.
* ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చింది?
ప్రతాప్: నా తొలి సినిమా ‘కరెంట్’ పూర్తయ్యాక దర్శకుడు సుకుమార్ బృందంలో రచయితగా చేరాను. ఆ ప్రయాణంలోనే సుకుమార్కి ‘కుమారి 21 ఎఫ్’ ఆలోచన వచ్చింది. దానికి నేను దర్శకత్వం వహించా. అది పూర్తయ్యాక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాలకు పనిచేశా. అలా గ్యాప్ వచ్చింది.
* ‘18 పేజేస్’ ఎలాంటి ప్రేమకథ?
ప్రతాప్: ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇందులో ఎమోషన్, ఫన్, థ్రిల్.. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలున్నాయి. సినిమా ముగింపు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేక్షకులకు మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఈ కథ, అందులోని పాత్రలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.
* ‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ క్రేజ్ బాగా పెరిగింది. ఈ కథలో ఏమైనా మార్పులు చేశారా?
ప్రతాప్: లేదు. నేను కథను బాగా నమ్ముతా. ‘అన్నింటి కంటే, అందరి కంటే కథే గొప్పది’ అనే దాన్ని సుకుమార్ అన్నయ్య నుంచి నేర్చుకున్నా. అయితే, నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి నేను కచ్చితంగా కొన్ని మార్పులు చేయాలి. అలా అని అవి కథపరంగా చేయలేదు. ‘నేను పాన్ ఇండియా నటుణ్ని అయినా ముందు నాకు ఏ కథ చెప్పారో ఆ కథే తియ్యండి’ అని నిఖిల్ అంటుండేవాడు.
* ట్రైలర్లోనే కథను కొంచెం బయటపెట్టారు కదా. సినిమాపై ఆసక్తి ఉంటుందంటారా?
ప్రతాప్: జిలేబి తియ్యగా ఉంటుందని మనకు తెలుసు. అయినా దాన్ని ఆస్వాదిస్తాం. సినిమా విషయంలోనూ అంతే. కథని కొందరు ఊహించవచ్చు. కానీ ఎప్పుడు? ఎక్కడ? ఏం జరుగుతుందో తెలియదు. ఆ ప్రయాణం ముఖ్యం.
* నిర్మాణ సంస్థ గురించి...
ప్రతాప్: గీతా ఆర్ట్స్ సంస్థలో పని చేయడాన్ని గౌరవంగా భావించా. ఈ బ్యానర్లో వర్క్ చేస్తే మంచి గుర్తింపు వస్తుంది. ఏదైనా విషయంలో దర్శకులు కాంప్రమైజ్ అయినా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు కాంప్రమైజ్ అవరు.
* తదుపరి ప్రాజెక్టుల వివరాలు చెబుతారా?
ప్రతాప్: మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థతో వేర్వేరుగా ఎప్పుడో సినిమాలు చేయాల్సి ఉంది. సుకుమార్ దగ్గర ఐదు కథలు తీసుకున్నా. వాటిల్లో రెండు అయ్యాయి. మిలిగిన కథలను తెరకెక్కించాలి. నేను రాసిన ఓ స్టోరీకి నిర్మాతల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా