SVP: మహేష్ నాకెందుకు అవకాశం ఇచ్చారో త్వరలోనే తెలుస్తుంది : పరశురామ్
‘యువత’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, ‘ఆంజనేయులు’తో నవ్వులు పంచి, ‘సోలో’తో కుటుంబ విలువల గురించి చెప్పి, ‘సారొచ్చారు’, ‘శ్రీరస్తు శుభమస్తు’తో అలరించి, ‘గీత గోవిందం’తో వావ్ అనిపించారు పరశురామ్. సినిమాసినిమాకు వైవిధ్యాన్ని కోరుకునే ఆయన మహేశ్బాబుతో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కించారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘యువత’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, ‘ఆంజనేయులు’తో నవ్వులు పంచి, ‘సోలో’తో కుటుంబ విలువల గురించి చెప్పి, ‘సారొచ్చారు’, ‘శ్రీరస్తు శుభమస్తు’తో అలరించి, ‘గీత గోవిందం’తో వావ్ అనిపించారు పరశురామ్. సినిమాసినిమాకు వైవిధ్యాన్ని కోరుకునే ఆయన మహేష్బాబుతో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కించారు. బ్యాంకు నేపథ్యంలో సాగే ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..
* ఈ కథ ఎప్పుడు, ఎలా మొదలైంది?
పరశురామ్: ‘గీత గోవిందం’ నిర్మాణ దశలోనే ‘సర్కారు వారి..’ చిత్రానికి సంబంధించి ఓ పాయింట్ తట్టింది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఆ లైన్పై దృష్టి పెట్టా. మహేష్బాబును హీరోగా ఊహిస్తూ కథ రాయడం ప్రారంభించా. ఓసారి ఆయన్ను కలిసి స్క్రిప్టు వినిపించా. కథతోపాటు కథానాయకుడి పాత్రను డిజైన్ చేసిన విధానం ఆయనకు ఎంతగానో నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్టులో నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. మహేష్బాబు లుక్స్, నటన మరోస్థాయిలో ఉంటాయి. ‘మీడియం రేంజ్ దర్శకుడికి మహేష్ ఎలా అవకాశం ఇచ్చారు’ అని కొందరు అనుకోవచ్చు. సినిమా విడుదల తరవాత వారి సందేహాలన్నీ తీరతాయి.
* సినిమాలో మహేష్ బ్యాంకు ఉద్యోగిగా కనిపిస్తారా?
పరశురామ్: రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్య జరిగే కథే ఈ సినిమా. ఇందులో బ్యాంకు నేపథ్యంలోని సన్నివేశాలుంటాయి కానీ హీరో బ్యాంకు ఉద్యోగి కాదు. అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమాలో ఒక వ్యక్తినిగానీ వ్యవస్థనుగానీ ప్రశ్నించలేదు.
* ఇతర ముఖ్య పాత్రల గురించి చెప్తారా?
పరశురామ్: ఇందులో కీర్తి సురేష్ పాత్ర చాలా కీలకం. కథానాయకుడి పాత్రకు సమానంగా ఉంటుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆమె మరోసారి కట్టిపడేస్తుంది. సముద్రఖని ప్రతినాయకుడి పాత్రకు ప్రాణం పోశారు.
* సంగీత దర్శకుడు గురించి..
పరశురామ్: ముందుగా ఈ సినిమా సంగీతం కోసం గోపీ సుందర్ను తీసుకోవాలనుకున్నా. ఆయన ఇతర ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండటంతో సాధ్యపడలేదు. తర్వాత తమన్ను ఎంపిక చేశా. ఈ సినిమా కోసం ఆయన సరికొత్త ధ్వనులను సృష్టించాడు. కథానుసారం పాటలను అద్భుతంగా రూపొందించాడు. మహేశ్ తనయ సితారను ప్రమోషన్లో భాగంగానే వీడియోలో చూపించాం. సినిమాలో తను కనిపించదు.
* ఈ సినిమాతో ఏదైనా సందేశం ఇవ్వబోతున్నారా?
పరశురామ్: సందేశమంటూ ఏం ఉండదు. కానీ ఓ పాయింట్ మాత్రం కొందరిలో మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నా. అదేంటన్నది సినిమా చూసి తెలుసువాల్సిందే.
* పాన్ ఇండియా ఆలోచన చేయలేదా?
పరశురామ్: లేదండీ. నాకూ మహేష్కి ఆ ఆలోచనే లేదు. తెలుగులోనే తీయాలనుకున్నాం. మంచి ఔట్పుట్ కోసం ఎంత కష్టపడాలో అంత శ్రమించాం.
* ‘నేను విన్నాను.. నేనున్నాను’ డైలాగ్ పెట్టేందుకు కారణం?
పరశురామ్: నాకు దివంగత రాజశేఖర్రెడ్డి అంటే అభిమానం. ఆయన్ను చూస్తే హీరోని చూసినట్టే ఉండేది. ఎలాంటి సందర్భంలో అయితే ఆయన ఆ మాటను వాడారో ఈ సినిమాలో అలాంటి సన్నివేశంలోనే ఈ డైలాగ్ వినిపిస్తుంది. వినడానికి చాలా సింపుగా ఉన్నా ఎంతో గొప్ప మాట అది. కథలో భాగంగానే మహేష్కు ఈ సంభాషణ గురించి చెప్పా. సినిమాలో పెట్టేందుకు ఆయన ఓకే అన్నారు.
* తదుపరి ఏ హీరోతో చేస్తున్నారు?
పరశురామ్: నాగచైతన్య హీరోగా ఓ చిత్రం చేయబోతున్నా. 14 రీల్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?