Parasuram: ‘సర్కారు వారి పాట’.. నా కల నెరవేర్చింది
‘గీత గోవిందం’తో సంచలన విజయం సాధించిన దర్శకుడు పరశురామ్. ఆ విజయమే ఆయనకి మహేష్తో సినిమా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తనదైన రచనతో కట్టిపడేసే పరశురామ్ శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘గీత గోవిందం’తో సంచలన విజయం సాధించిన దర్శకుడు పరశురామ్. ఆ విజయమే ఆయనకి మహేష్తో సినిమా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తనదైన రచనతో కట్టిపడేసే పరశురామ్ శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
ఈ కథ ఎలా పుట్టింది?
‘గీత గోవిందం’ ఇంకో నెలలో విడుదలవుతుందనగా ఈ కథ అనుకున్నా. ఆ సినిమా విడుదల తర్వాత మహేష్బాబుని దృష్టిలో ఉంచుకునే సిద్ధం చేశా. ఆయనతో సినిమా చేయాలనేది నా కల. అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది.
మహేష్కి ఈ కథ చెప్పినప్పుడు ఆయన స్పందనేంటి?
ఆయనకి కథ ఎంతగా నచ్చిందో, ఆయన పాత్రని డిజైన్ చేసిన విధానమూ అంతే నచ్చింది. ఈ సినిమా చేయడానికి ఓ బలమైన కారణం అది. పాత్ర మొదలుకొని సంభాషణలు చెప్పడం వరకు అన్నీ కొత్తగా ఉంటాయి. ఇది వాణిజ్య వినోదంతో కూడిన కథే. హీరో లుక్స్, ఆ పాత్రని ఆవిష్కరించిన తీరు మరో స్థాయిలో ఉంటుంది. పెద్ద దర్శకులు ఉండగా, పరశురామ్కి అవకాశం ఎందుకిచ్చారా? అనే సందేహం అభిమానుల్లో రావొచ్చు. ఇది చూశాక అది ఎందుకనేది తెలుస్తుంది. అభిమానులే కాదు, సామాన్య ప్రేక్షకులూ మెచ్చేలా ఉంటుందీ చిత్రం. హీరోయిన్ పాత్రకి కీర్తిని ఎందుకు ఎంపిక చేశామో సినిమా చూశాక అర్థమవుతుంది. ఆమెకు మంచి పేరొస్తుంది. సముద్రఖని, తమన్ సంగీతం... ఇలా అందరి పనితనం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
అప్పుని ఆడపిల్లతో పోల్చారు, ఈ కథకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?
అప్పుని ఆడపిల్లతో పోల్చడంలోనే అసలు కథ ఉంది. రెండు విభిన్నమైన ఆలోచనల మధ్య సాగుతుంది. ఇక స్ఫూర్తి అంటారా? ఇందులో ఏ వ్యక్తి, వ్యవస్థ గురించీ ఉండదు. ఒక మంచి ఉద్దేశంతో చెబుతున్న కథ ఇది. సరదాగా ముందుకు నడుపుతూనే చెప్పాల్సింది బలంగా చెప్పే ప్రయత్నం చేశా. సందేశం ఇవ్వడం అంటూ ఉండదు కానీ, ఆఖర్లో ఓ బలమైన ఉద్దేశాన్ని చాటి చెబుతుంది. అది అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది.
ఈ చిత్రాన్ని చాలామంది ‘పోకిరి’తో పోల్చి చూసుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
‘పోకిరి’ బయటికి కనిపించని ఓ పోలీస్ అధికారి కథ. ఇది కామన్ మేన్ కథ. ఇందులో మరికొంచెం ఎక్కువగా ఓపెన్ అయినట్టు కనిపిస్తారు మహేష్. ఆయన మేనరిజమ్, లుక్, హావభావాలు చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతారు. ఆయన డ్యాన్స్లు ఉర్రూతలూగిస్తాయి. బ్యాంక్ నేపథ్యంలో కథ సాగినా మహేష్ మాత్రం బ్యాంక్ ఉద్యోగి కాదు. ఆయన ఒంటిపై కనిపించే పచ్చబొట్టు వెనకా ఓ కథ ఉంటుంది.
సంభాషణల విషయంలో మీకు ప్రేరణనిచ్చే విషయాలేమిటి?
మా గురువు పూరి జగన్నాథ్. అలాగే త్రివిక్రమ్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఎప్పట్నుంచో చూస్తున్నా. మహేష్తో చేస్తున్నానని మా గురువు పూరి జగన్నాథ్కి చెప్పా. పేరు ప్రకటించాక, ట్రైలర్ చూశాక ఫోన్ చేశారు. ఆయనకి ట్రైలర్లో డైలాగులు బాగా నచ్చాయి. కథ చెప్పేటప్పుడే ‘నేను విన్నాను... నేను వున్నాను’ అనే డైలాగ్ మహేష్కి చెప్పా. ఆయన సెట్లో ఆస్వాదిస్తూ ఆ సంభాషణ చెప్పారు. ఆ సన్నివేశం చాలా బాగుంటుంది.
‘గీత గోవిందం’ మీ కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపించింది?
గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. పరశురామ్ అనే దర్శకుడు రూ.150 కోట్ల సినిమా తీయగలడనే నమ్మకాన్నిచ్చింది. రూ.8 కోట్లతో తీసి రూ.150 కోట్లు స్థాయి విజయాన్ని సాధిస్తే అది దర్శకుడికి ఎంత ఆత్మవిశ్వాసాన్నిస్తుందో ఊహించొచ్చు. నా ఆలోచనా విధానాన్నీ మార్చింది.
తదుపరి మీరు చేయనున్న సినిమా ఎవరితో?
నాగచైతన్య కథానాయకుడిగా 14 రీల్స్ సంస్థలో సినిమా ఉంటుంది. అది దీనికన్నా ముందే చేయాలనుకున్నా. అప్పట్లో రాసుకున్న కథతోనే ఇప్పుడు చేస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)