Rajamouli: తెలుగు రాష్ట్రాల సీఎంలకు రాజమౌళి కృతజ్ఞతలు

చలన చిత్ర పరిశ్రమపై చొరవ చూపి, తగిన సహకారం అందించినందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.

Published : 10 Mar 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చలన చిత్ర పరిశ్రమపై చొరవ చూపి, తగిన సహకారం అందించినందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. భారీ బడ్జెట్‌ చిత్రాలకు 5 షోలు వేసుకునే వెసులుబాటు కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి సంతృప్తికరమైన జీవో ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి థ్యాంక్స్‌ చెప్పారు. సంబంధిత మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పేర్నినానికి ధన్యవాదాలు తెలిపారు. సినిమా టికెట్‌ ధరలకు సంబంధించిన ఏపీ కొత్త జీవోపై చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌  సంతోషం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వానికి ఇటీవల ధన్యవాదాలు తెలిపారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని