ఆరు నెలల్లో చేయాల్సిన మూవీ 4 నెలల్లోనే!
మా సినిమా చిత్రీకరణ సాగుతున్న విధానం కూడా అదుర్సే’ అంటున్నారు సంతోష్ శ్రీనివాస్. ‘కందిరీగ’, ‘రభస’, ‘హైపర్’ సినిమాలతో వినోదాన్ని పంచిన దర్శకుడాయన. ప్రస్తుతం
మా సినిమా చిత్రీకరణ సాగుతున్న విధానం కూడా అదుర్సే’ అంటున్నారు సంతోష్ శ్రీనివాస్. ‘కందిరీగ’, ‘రభస’, ‘హైపర్’ సినిమాలతో వినోదాన్ని పంచిన దర్శకుడాయన. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా ‘అల్లుడు అదుర్స్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత పునః ప్రారంభమై, నిరాటంకంగా షూటింగ్ జరుపుకొంటున్న చిత్రాల్లో ఇదొకటి. ఈ సందర్భంగా సంతోష్ శ్రీనివాస్తో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది.
కరోనా భయాల మధ్య చిత్రీకరణ చేయడం కష్టంగా ఉందా?
చిత్రీకరణ చేయగలమా? లేదా? అనే భయాల మధ్యే సెట్లోకి అడుగుపెట్టాం. ఒకట్రెండు రోజుల్లో అంతా అలవాటైంది. ప్రముఖ నటులు 20 మందిదాకా సెట్కి వచ్చారు. కరోనా పరిస్థితుల మధ్య అంతమందితో చిత్రీకరణ అంటే రామోజీ ఫిల్మ్సిటీలో చేయడమే సరైన నిర్ణయం అని భావించాం. అక్కడ ఒక పద్ధతి, ప్రణాళిక ఉంటుంది. తీసుకునే జాగ్రత్తలు చాలా బాగుంటాయి. అంత మంది నటులతో పది రోజులపాటు ఫిల్మ్సిటీలో నిరాటంకంగా షూటింగ్ చేశాం.
చిత్రీకరణలో మునుపటి వేగం ఇప్పుడు ఉండదు కదా?
ఇదివరకటితో పోలిస్తే 20 శాతం పనులు నిదానంగా జరుగుతుంటాయి. సాంకేతిక బృందంలో సభ్యులు పరిమిత సంఖ్యలో ఉంటారు. ఎవరికివాళ్లు సామాజిక దూరం పాటిస్తూ, జాగ్రత్తగా షూటింగ్లో పాల్గొనాలి. మొత్తంగా ఇంతకుముందుకీ, ఇప్పటికీ పద్ధతి మారినట్టుగా అనిపిస్తుంది. రోజులు గడుస్తున్నకొద్దీ సెట్లో తీసుకుంటున్న జాగ్రత్తలకీ, చిత్రీకరణ పద్ధతులకీ అలవాటైపోతున్నాం. ఇదివరకు లేని క్రమశిక్షణ ఇప్పుడు సెట్లో కనిపిస్తోంది.
‘అల్లుడు అదుర్స్’ అంటున్నారు. ఇది అల్లుడు కథా?
ప్రతి కుటుంబానికీ ఒక అల్లుడు ఉంటాడు. అల్లుడంటే ఎలాగో ప్రతి కుటుంబానికీ అదుర్సే. ఇదొక పూర్తిస్థాయి కుటుంబ వినోదాత్మక చిత్రం. అంతా కలిసి ఆస్వాదించేలా ఉంటుంది హాస్యం. కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తొలిసారి ఒక పూర్తిస్థాయి ఉల్లాసభరితమైన పాత్రలో కనిపిస్తాడు. పరిశ్రమలోని దాదాపు హాస్యనటులు ఇందులో కనిపిస్తారు. ప్రతి పాత్రా నవ్విస్తుంది.
ఇదివరకటి మీ సినిమాకీ, ఈ సినిమాకీ మధ్య విరామం ఎక్కువగా వచ్చింది. కారణమేమిటి?
మరో హీరోతో సినిమా చేయాలనుకున్నా. అది ఆలస్యమైంది. కొంచెం విరామం వచ్చింది. ఇక నుంచి మాత్రం విరామం లేకుండా సినిమాలు చేస్తా. ఇప్పటికే రెండు మూడు కథలు సిద్ధం చేసుకున్నా. ప్రస్తుతానికి ‘అల్లుడు అదుర్స్’పైనే దృష్టిపెట్టా. అందరికీ గుర్తుండిపోయేలా ఈ సినిమా చేస్తా.
స్క్రిప్ట్లోనే ఎడిట్
‘‘సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఎక్కడో ఒక చోట తనని తాను చూసుకోవాలి. మన ఇళ్లల్లో జరిగే కథ అనుకోవాలి. భావోద్వేగాలు, కామెడీతోపాటు నా మార్క్ ఎనర్జీ, యాక్షన్ అంశాల్ని జోడించి కుటుంబ కథల్ని తెరకెక్కించడమంటే నాకు ఇష్టం. నా సినిమాల్ని గమనిస్తే అన్నింట్లోనూ వినోదంతోపాటు అంతర్లీనంగా సందేశం ఉంటుంది. కుటుంబ విలువలు కనిపిస్తాయి. నాలో దర్శకుడితోపాటు ఛాయాగ్రాహకుడు కూడా ఉండటం కలిసొచ్చే అంశం. ఆరు నెలల్లో చేయాల్సిన సినిమాని నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తా. ప్రతి షాట్పైనా ఒక స్పష్టత ఉంటుంది. ఎడిటింగ్ రూమ్లో కంటే స్క్రిప్ట్లోనే సన్నివేశాల్ని ఎడిట్ చేసుకుని సెట్పైకి వెళుతుంటా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.