sri karthik: అమ్మా... అణువణువూ నీ కొలువే
గిలిగింతలు పెట్టే ప్రేమ పాటలైనా.. మురిపించి, మైమరపించే అమ్మ లాలి పాటలైనా.. సిరివెన్నెల కలం నుంచి జాలువారితే అమృత గుళికల్లా సినీప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సిందే. ఆయనిప్పుడు
గిలిగింతలు పెట్టే ప్రేమ పాటలైనా.. మురిపించి, మైమరపించే అమ్మ లాలి పాటలైనా.. సిరివెన్నెల కలం నుంచి జాలువారితే అమృత గుళికల్లా సినీప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సిందే. ఆయనిప్పుడు భౌతికంగా ఈ లోకంలో లేకున్నా.. చివరి రోజుల్లో ఆయన కలం నుంచి జాలువారిన గీతాలన్నీ ఇప్పుడు ఒకొక్కటిగా సినీ సంగీత ప్రియుల ముందుకొస్తూనే ఉన్నాయి. అలా ఇటీవల వచ్చిన గీతాల్లో ‘ఒకే ఒక జీవితం’లోని ‘‘అమ్మ..’’ పాట ఒకటి. శర్వానంద్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రమిది. శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. జేక్స్ బిజాయ్ స్వరాలందించారు. ఈ సినిమా కోసం సిరివెన్నెల రాసిన ‘‘అమ్మ..’’ పాట ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం దీనికి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ పాట విశేషాలను.. చిత్ర దర్శకుడు కార్తిక్ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
‘‘దర్శకుడిగా నా తొలి సినిమా ఇది. ఆసక్తికరమైన టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందింది. మాతృ బంధంతో ముడిపడి ఉంటుంది. ఈ కథే తల్లితో అల్లుకున్న అనుబంధాల నేపథ్యంలో సాగుతుంటుంది కాబట్టి ఇందులోని అమ్మ పాట ఎంతో గొప్పగా ఉండాలని స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పటి నుంచి అనుకునేవాడ్ని. సినిమా మొదలయ్యాక శర్వానంద్తో ఈ విషయం చెబితే.. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఆ పాట రాయిద్దామని చెప్పారు. అలా ఈ గీతం కోసం 2020లో తొలిసారి సిరివెన్నెల దగ్గరికి వెళ్లాను. నేను ఈ పాట సందర్భాన్ని వివరించడానికి ముందే.. మొత్తం సినిమా కథని ఆయనకు వివరించా. చాలా బాగుందని మెచ్చుకున్నారు. తర్వాత పాట సందర్భం చెప్పా. ఈ పాట వింటే చిన్నతనంలో అమ్మతో కలిసి ఉన్న జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు మెదలాలి.. అలాగే ఇప్పటి వరకు చాలా అమ్మ పాటలొచ్చాయి వాటికి భిన్నంగా కొత్తగా ఉండాలని చెప్పా. ఆయన అంతా విని.. నాకు కొంత సమయం కావాలన్నారు. ఈ పాట పూర్తి కావడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. మధ్య మధ్యలో నేను సిరివెన్నెల గారికి ఫోన్ చేసి పాట గురించి అడిగే వాడ్ని. ‘అమ్మ పాట ఇది.. తరతరాలు గుర్తుండిపోయాలా ఉండాలి కదా’ అనేవారు. తొలిసారి పాట వినిపించినప్పుడు చాలా గొప్పగా అనిపించింది. పాటలోని ఒక్కో లైన్ వింటుంటే.. మా అమ్మ నా కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు అనిపించింది. నిజానికి నేనీ కథ మా అమ్మ కోసమే రాసుకున్నా. తను ఐదేళ్ల క్రితం క్యాన్సర్తో కన్నుమూసింది. అమ్మని తిరిగి చూసే అవకాశమొస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన నుంచే ఈ కథ అల్లుకున్నా. సిరివెన్నెల రాసిన అమ్మ పాట విన్నాక.. నా కథకు పరిపూర్ణత వచ్చినట్లయింది. ఈ పాటని సినిమాలో ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. ఇది కథలో భాగంగానే ఉంటుంది తప్ప.. ఎక్కడా ఇరికించినట్లు ఉండదు. ఈ చిత్రానికి ఈ పాటే హార్ట్. దీన్ని మేము సిరివెన్నెలకీ చూపించాం. అప్పటికీ పాటను తెరకెక్కించలేదు కానీ, యానిమేటెడ్ కాన్సెప్ట్లా తయారు చేసి విజువల్గా ఆయనకు చూపించాం. ‘చాలా బాగుంది. అమ్మ ఆశీర్వాదం ఉంది. సినిమా పెద్ద హిట్ అవుతుంద’ని మెచ్చుకున్నారు. ఈ పాటలో ‘‘బెదురు పోవాలంటే.. నువ్వు కనిపించాలి.. నిదర రావాలంటే.. కథలు వినిపించాలి... ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి... ప్రతి మెతుకు.. నా బ్రతుకనిపించేలా... నువ్వుంటేనే.. నేను.. నువ్వంటే నేను’’ అనే లైన్స్ ఉంటాయి. అవి నా మనసుకు ఎంతో హత్తుకున్నాయి. ఈ గీతాన్ని మేము తొలుత సిద్ శ్రీరామ్తో కాకుండా మరొకరితో పాడించాం. తర్వాత మా చిత్ర నిర్మాత సిద్తో పాడిద్దామన్నారు. అలా సిద్ శ్రీరామ్తో ఈ పాట మళ్లీ పాడించాం. ఫలితంగా ఈ గీతానికి మరింత హైప్ వచ్చింది. ఈ పాట విడుదలయ్యాక హీరో నాగార్జున, సాయి తేజ్, విజయ్ దేవరకొండ తదితరులంతా ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. నిర్మాణాంతర పనులు 80శాతం వరకు పూర్తయయ్యాయి. మంచి తేదీ చూసుకుని మార్చి లేదా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’.
కొత్త పాట
చిత్రం: ఒకే ఒక జీవితం
సంగీతం: జేక్స్ బిజోయ్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్
దర్శకుడు: శ్రీ కార్తిక్
అమ్మా.. వినమ్మా..
నేనానాటి నీ లాలి పదాన్నే..
అవునమ్మా.. నేనేనమ్మా..
నువ్వేనాడో కనిపెంచిన స్వరాన్నే...
మౌనమై ఇన్నాళ్లు నిదరలోనే వున్నా...
గానమై ఈనాడే మేలుకున్నా...
నీ పాదాలకు మువ్వల్లా...
నా అడుగులు సాగాలమ్మా...
నీ పెదవుల చిరునవ్వుల్లా..
నా ఊపిరి వెలగాలమ్మా..
నిరంతరం నీ చంటిపాపల్లే..
ఉండాలిలే నేనెన్నాళ్ళకీ...
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే..
అమ్మా అణువణువూ నీ కొలువే..
అమ్మా.. ఎదసడిలో శృతిలయ నువ్వే..
అమ్మా.. నే కొలిచే శారదవే..
నను నిత్యం నడిపే సారథివే...
బెదురు పోవాలంటే..
నువ్వు కనిపించాలి..
నిదర రావాలంటే..
కథలు వినిపించాలి...
ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి...
ప్రతి మెతుకు.. నా బ్రతుకనిపించేలా...
నువ్వుంటేనే.. నేను.. నువ్వంటే నేను..
అనుకో లేకపోతే .. ఏమైపోతాను...
నీ కడచూపే నన్ను.. కాస్తూ ఉండక...
తడబడి పడిపోనా చెప్పమ్మా...
మరిమరి నను నువు మురిపెంగా.. చూస్తూ ఉంటే చాలమ్మా..
పరిపరి విధముల గెలుపులుగా..
పైకెదుగుతు ఉంటానమ్మా..
అయినా సరే ఏనాటికి
ఉంటాను నీ పాపాయినై...
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే..
నిరంతరం నీ చంటిపాపల్లే..
ఉండాలి నేనెన్నాళ్ళకీ...
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే..
//అమ్మా అణువణువూ//
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!