Hero: అందుకే అశోక్కు చిరంజీవి, మహేశ్బాబు సినిమాలు చూడమని చెప్పా: శ్రీరామ్ ఆదిత్య
‘శమంతకమణి’, ‘భలేమంచి రోజు’, ‘దేవదాస్’ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు శ్రీరామ్ ఆదిత్య. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, మహేశ్బాబు మేనల్లుడు అశోక్ను హీరోగా ఆయన పరిచేస్తున్న చిత్రం ‘హీరో’.
ఇంటర్నెట్ డెస్క్: ‘శమంతకమణి’, ‘భలేమంచి రోజు’, ‘దేవదాస్’ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు శ్రీరామ్ ఆదిత్య. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, మహేశ్బాబు మేనల్లుడు అశోక్ను హీరోగా ఆయన పరిచయం చేస్తున్న చిత్రం ‘హీరో’. గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా జనవరి 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు.
* నేను రాసుకున్న కథకు కొత్త నటుడైతేనే న్యాయం జరుగుతుందని భావించా. ఆ ప్రయత్నంలో భాగంగా గల్లా అశోక్ కనిపించారు. వాళ్ల అమ్మగారికీ కథ బాగా నచ్చటంతో సినిమాను పట్టాలెక్కించారు. ఆమే నిర్మాతగా మారారు. అశోక్కు నటనపై చాలా ప్యాషన్ ఉంది. మనలో చాలామంది ఏదో సందర్భంలో హీరో అవ్వాలనుకుంటారు. నలుగురిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఫీల్ అవుతుంటారు. ఈ పాయింట్తో సినిమా తీస్తే బాగుంటుందనుకుని, అలాంటి కొందరిని స్టడీ చేసి కథను రాశా. హీరో అవ్వాలనుకునే కుర్రాడి కథ కాబట్టి ‘హీరో’ అనే టైటిల్ పెట్టాం.
* పూర్తిస్థాయి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తీశాం. ఈ సినిమా నాన్స్టాప్గా అలరిస్తుంది. అశోక్ నటన చూస్తే కొత్తవాడనే ఆలోచనే ప్రేక్షకులకు రాదు. అంత బాగా హీరో పాత్రను పండించాడు. కౌబాయ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కించాలనేది నా కోరిక. ఇలాంటి చిత్రాల గురించి ఆలోచిస్తుంటే కృష్ణ, మహేశ్బాబు గుర్తుకొస్తారు. కథానుసారం ఈ సినిమాలో అశోక్ను కౌబాయ్, జోకర్గా చూపించే అవకాశం వచ్చింది. అశోక్ను చూస్తే కొత్తవాడనే ఫీలింగ్ రాకూడదని చిరంజీవి, మహేష్ బాబు తదితరుల సినిమాలు చూడమని అతనికి చెప్పాను. ఆ హీరోల కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చుతుంది. అశోక్ యూఎస్లో చదివినా తెలుగులో స్పష్టంగా మాట్లాడతాడు, బాగా రాస్తాడు. అందుకే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు.
* లాక్డౌన్లో సమయంలో ఓటీటీ వేదికగా చాలామంది ఇతర భాషా చిత్రాల్ని బాగా ఆస్వాదించారు. అలాంటి వారందరికీ ‘హీరో’ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. థియేటర్లలోనే చూడాల్సిన సినిమా ఇది. ఇందులో ప్రయోగంతోపాటు వాణిజ్యాంశాలు మెండుగా ఉన్నాయి. నిధి అగర్వాల్ చాలా బాగా నటించింది. కృష్ణగారు గతంలో నేను తీసిన ‘భలేమంచి రోజు’ సినిమా చూసి మెచ్చుకున్నారు. ఇప్పుడు ‘హీరో’ విషయంలోనూ అభినందించారు. చాలా బాగా తీశానని మెచ్చుకోవడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. నా అభిమాన దర్శకుడు రాజమౌళి ట్రైలర్ విడుదల చేయటం ఆనందాన్నిచ్చింది.
* ఈ చిత్రాన్ని నవంబర్లోనే విడుదల చేద్దామనుకున్నాం. కానీ ప్రేక్షకులు థియేటర్లు వస్తారా లేదా అని ఆ సయమంలో సందేహించాం. సంక్రాంతి రావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా పడడంతో మా సినిమాతో వినోదం పంచేందుకు సిద్ధమయ్యాం. నాకు ఓటీటీ వైపు వెళ్లాలనే ఆలోచన లేదు. భవిష్యత్తులో నిర్మాణ బాధ్యతలు చేపడతానేమో చూడాలి. ప్రస్తుతానికి నా దగ్గర చాలా కథలున్నాయి. అయితే ఇంకా ఏది పట్టాలెక్కించాలో ఖరారు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.