Welcome To Tihar College: అలాంటి విద్యా వ్యవస్థ అవసరం
‘‘ర్యాంకుల పోటీలో పడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా.. ఆలోచింపజేసే విధంగా చూపించే చిత్రమే మా ‘వెల్కమ్ టు తిహార్ కాలేజ్’.
‘‘ర్యాంకుల పోటీలో పడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా.. ఆలోచింపజేసే విధంగా చూపించే చిత్రమే మా ‘వెల్కమ్ టు తిహార్ కాలేజ్’ (Welcome To Tihar College). యువతరం కలలు.. ఆశలు.. ఆలోచనలు.. అభిరుచులకు అద్దం పట్టేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి (Sunil kumar Reddy). ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ వంటి సందేశాత్మక సినిమాలతో మెప్పించిన ఆయన.. ఇప్పుడు ‘వెల్కమ్ టు తిహార్ కాలేజ్’ చిత్రంతో పలకరించనున్నారు. మనోజ్ నందమ్, ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సునీల్ కుమార్.
‘‘పిల్లలకు విజ్ఞానంతో పాటు తమ మీద తమకు విశ్వాసం కలిగించేలా చేయాలి విద్యా వ్యవస్థ. అంతే కానీ, ర్యాంకులే జీవితం అన్నట్లుగా ఉండకూడదు. ఈ విషయాల్నే సినిమాలో చూపించాం. దీన్ని విద్యార్థుల కోణం నుంచే తెరపైకి తీసుకొచ్చాం. వాళ్లు పడే బాధలు ఎలా ఉంటాయో ఆసక్తికరంగా చూపించాం. కథకు తగ్గట్లుగా ఉంటారనే మనోజ్ నందమ్, చక్రవర్తి, మనీషా, సోనీ రెడ్డిలను ప్రధాన పాత్రలకు తీసుకున్నాం. ఈ నాలుగు పాత్రల్లో యువత తమని తాము చూసుకుంటారు’’.
* ‘‘ఈ రోజుల్లో ఉన్న మన విద్యా విధానం వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ర్యాంకుల కోసం పిల్లల ప్రాణాల్ని తోడేస్తున్నాం. చాలా దేశాల్లో ఇలాంటి విద్యా విధానం లేదు. కొన్ని దేశాల్లో ప్రకృతితోనే ఎన్నో పాఠాలు నేర్పుతున్నారు. అలాంటి విద్యా వ్యవస్థ ఇక్కడా రావాలి. లేదంటే పిల్లలు ఇంకా నలిగిపోతారు. ఈరోజుల్లో ఫలానా దాని గురించి తెలుసుకోవాలంటే గూగుల్ని అడిగితే చెప్పేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ చదువుల్ని బట్టీ పట్టాల్సిన అవసరం ఏముంది. క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’’.
* ‘‘ప్రస్తుతం చదలవాడ శ్రీనివాసరావు నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నా. అలాగే ట్రాన్స్ జెండర్స్పై ఓ చిత్రం చేయబోతున్నా. ఇది ప్రస్తుతానికి స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలో సెట్స్పైకి తీసుకెళ్తాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప